Saturday, December 31, 2011

శుభాకాంక్షలు

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు.
2012,మధురంగా,మధురమైన భావాలతో,మధురమైన భాషతో,మధురూహలతో,మిత్రులందరకూ నూతనసంవత్సరం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ.............లక్ష్మి

Wednesday, December 28, 2011

యోగము

యోగమనగా ప్రత్యగాత్మకు పరమాత్మకు ఐక్య సంబంధము.అనగా మనస్సును అనేక రీతుల సంచరింపనీయక ,తన యందేమగ్నము చేసికొనుట ఇంద్రియములను వశపరచుకొని చిత్తము ఈశ్వరుని యందు లయింప చేయుటయే యోగమనబడును. యోగశాస్త్రములను చదివినంత మాత్రముననే యోగీశ్వరుడు కాజాలడు. సాధన చతుష్టయ సంపత్తి కలిగిన మీదట సమాధి స్థితి కలుగును. ఆ సమాధి వలన ముక్తి లభించ గలదు. యోగసిధ్ధి అనుదినము రెండు ఝాములు అలవాటు చేసిన నిశ్చల చిత్తవృత్తి గల నరునకు ఆరు మాసములందును, మంద్ర ప్రజ్ఞునకు పన్నెండు మాసములు మూడాత్మునకు పన్నెండు సంవత్సరముల యందును సిధ్ధించును.
మూలాధారం గుదస్థానం, స్వాధిష్టానం తు మేహనం
నాభిస్తు మణిపూర్వాఖ్యాం ,హృదయాబ్జ మనా హతం,
తారుమూలం విశుధ్ధాఖ్యాం, ఆజ్ఞాఖ్యాం విఠలాంబుజం,
సహస్రారం బ్రహ్మరంద్రంచ ,మిధ్యాఅగమ న విదోవిదుహు.
ఆజ్ఞాచక్రం ఓం ఈశ్వరుడు
విశుధము యం జీవుడు
అనాహతం వా రుద్రుడు
మణిపూరకము శి లక్ష్మి,విష్ణువు
స్వాధిష్టానం మ సరస్వ తి,బ్రహ్మ
మూలాధారం న వినాయకుడు
ఇది సహస్రారం. ఇందు దృష్టిని నిలిపిన శబ్దమంతయు అణగి ప్రణవనాద మనెడు ఓం కారము వినబడును. అటుల అభ్యాసము చేయగా చెయగా ప్రణవనాదము తగ్గి స్వ ప్రకాశము కనబడును. దానినే ఆత్మజ్యోతి అనియెరుంగుము.

Monday, December 26, 2011

మంచి మాట

ఆవేశం, ఆలోచనని అణచి వేస్తుంది.ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకే ఈకష్టం ఎందుకు వచ్చిందనో,సమస్యకు కారకులైన వారిని నిందిస్తూ ఉండటం వల్ల పరిష్కారం కాదు. వివేచనతో సమస్యను గట్టెక్కడానికి ప్రయత్నం చేయాలి.

Saturday, December 24, 2011

మంచి మాట

అర్థం లేని శ్రమ ,అలసట లేని విశ్రాంతి వ్యర్థం. ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా కష్టపడటం ,ఏమీ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలనుకోవడం అవివేకం.

Thursday, December 22, 2011

మంచి మాట

మనిషికి వృధ్ధాప్యం రావచ్చు కానీ మనసుకి వృధ్ధాప్యం రాకూడదు. వయస్సును ఆపే శక్తి మనకు లేదు కాని మనస్సును శక్తి వంతం చేయటం మన చేతుల్లోనే ఉంటుంది.

Thursday, December 15, 2011

మంచి మాట

శ్రమించని మేధావి వర్షించని మేఘం వంటి వాడు.మేఘం లో ఎంత నీరున్నావర్షించక పోతే దాని వలన ప్రయోజనం లేదు. అలాగే పండితుడు కష్టపడక పోతే దానివలన తనకు ఇతరులకు కూడా ప్రయోజనం ఉండదు.

Saturday, December 10, 2011

మంచి మాట

అహంకారం ,అసూయ, ఆత్మస్తుతి ,అలసత్వం వదిలితె మనంత మంచి వాళ్ళు ఉండరు.

Tuesday, December 6, 2011

మంచి మాట

ఏ పనులు మాటల వలన మనము బాధ పడతామో ఆపనులు మాటలుమనము చేయ కుండా ఉండటమే అన్ని ధర్మముల కన్నా మనము అనుసరించ దగి గొప్ప ధర్మము

Monday, December 5, 2011

డాక్టర్ భోగరాజు పట్టాభిశీతారామయ్య

అపారమైన ఙాపకశక్తితో తిరుగులేనితర్కంతో అంకెలతో లెక్కలతోప్రతిదీ సిధాంతీకరిస్తూ ఆబాలగోపాలం చెవులు రిక్కించుకొని తదేక ధ్యానంతోఆలకిస్తుండగా అనర్గళంగా ఉపన్యసించడంలో ఆయనకు ఆయనే సాటి.ఒకవైపు ఉద్యమాగ్నిలో కాకలు తీరుతూనే మరొకవైపు భీమాసంస్థలు బ్యాంకుల నెన్నింటినోనెలకొల్పి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ను రూపుదిద్దడంలో అనుపమానమైన పాత్ర వహించినమహామనీషి అప్రతిమానమైన ఆంధ్రత్వానికి చిహ్నమై వెలసినధన్య జీవి పట్టాభిశీతారామయ్య గారు.
ఆయన పుట్టింది నేటి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో1880,నవంబర్24 న.ఉన్నతవిద్యాభ్యాసం ఏలూరు,మచిలీపట్టణాలలో.జరిగింది. బ్రహ్మర్షిగా పేరుపొందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు,చెన్నాప్రగడ భానుమూర్తి వంటి మహనీయుల శిష్యులై విద్యాభ్యాసం చీశారు. ఆయనకు ముట్నూరి కృష్ణా రావు గారితోను,కోపల్లె హనుమంతరావుగారితోను స్నేహం ఏర్పడింది. వీరు త్రిమూర్తులుగా పిలవబడేవారు.మద్రాసులో బి.ఎ చదివేరోజులలో గాంధీ గారితో పరిచయం ఏర్పడింది. కాకినాడ వాస్తవ్యులు గంజాం వెంకట రత్నం గారి కుమార్తెతోవివాహం జరిగాక ఎం.బి.సి.ఎం. చదివారు. అనంతరం బందరులోవైద్య వృత్తిని ప్రారంభించి రోగనిధానం చేయడంలో ప్రఖ్యాతి గడించారు.
భారతదేశ సేవాచరిత్రలో మూడు విషయాలు ఆయన శాశ్వత ప్రతిష్ట్టకు కారణమైనాయి. భాషాప్రయుక్త రాష్ట్ర పునర్విభజనకు ఆయన అనుపమానమైన సమర్ధన మొదటిది. 1908 నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అవిరళ కృషి చేశారు. "రాష్ట్రాల పునర్విభజననుగురించిసర్వ విషయాలు నీకు తెలుసు కనుక భారత దేశాన్ని అభిమతానుసారం సక్రమంగా విభజించు" అని గాంధీజీ ఆదేశించారు.అర్ధశతాబ్ది కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది."ఆంధ్రరాష్ట్రోద్యమ జనకులు"గా జనం హర్షంతో గౌరవించారు.
కాంగ్రెస్ వారిలో ఎవ్వరికీ సంస్థాన ప్రజల యెడ సానుభూతి లేని సమయంలోవారికి తాను అండగా నిలిచి చేసిన అమూల్యసేవరెండవది.స్వదేశ సంస్థాన ప్రజల సంస్థనొక దానిని స్థాపించి ,పట్టభిగారు దానికి ఫౌండర్ ,ప్రెసిడెంటుగా,బల్వంతరాయ్ మెహతా సెక్రటరీగా వ్యవహరించారు. ఆసేతు హిమాచలపర్యంతం పర్యటించి ప్రజల్లో చైతన్యం కలిగించి సంస్థానాల విచ్చిత్తికి పునాదులు వేసిన ఘనత వీరిదే. 1936లో కరాచీలో జరిగిన దేశీయ సంస్థానాల ప్రజల పౌరసత్వములను గురించి వీరు చేసిన ఉపన్యాసం చిరస్మరణీయమైనది.
ప్రపంచం అనేక వాదాలతో చిన్నాభిన్నమై ఆందోళన పడుతున్న సమయంలో కూడా గాంధీ వాదం లోని ప్రధాన సూత్రాల యెడ ఆయన చూపిన అచంచల విశ్వాసం మూడవది. బార్డోలీ సత్యాగ్రహ సంధర్భంలోను,ఉప్పు సత్యాగ్రహ సంధర్భంలోను గాంధీజీని సపూర్ణంగా బలపరచి అనేకులను కార్యోన్ముఖులుగా చేసిన కీర్తి పట్టాభికే దక్కింది.
ఇవిమూడు ఒకేత్తు ఆయన స్థాపించిన విద్యాసంస్థ్స్లు,బ్యాంకులస్థాపన,హరిజనోధ్ధరణ, గ్రామాలలో చిన్న తరహా పరిశ్రమలు,చేతిపనుల అభివృధి ఒక ఎత్తు.1910లో బందరులో జాతీయ కళాశాల స్థాపించి హరిజన విద్యార్ధులను కూడా అగ్ర వర్ణాల సరసన కూర్చొని చదువు కోడానికి ఏర్పాటు చేశారు.1923లో ఆంధ్రాబ్యంకు స్థాపన బందరులో జరిపి దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని ఆపురాతన పట్టణానికి కలిగించారు. 1929లో భారత లక్ష్మీ బ్యాంకు 1925లో ఆంధ్రా ఇన్సూరెన్సు కంపినీ 1935లో హిందూస్థాన్ ఇన్సూరెన్సు కంపినీ ప్రారంభించారు. కృష్ణా కోపరేటివ్ బ్యాంకు స్థాపించిన గౌరవం కూడా పట్టాభి గారిదే,ఆంధ్ర సహకార పత్రికను స్థాపించి సహకారోద్యమానికి ఎంతో దోహదపడ్డరు.
పట్టాభి బహు గ్రంధ కర్త కూడా. కాంగ్రెస్ చరిత్ర ,జాతియవిద్య .గాంధీ సిధ్ధాంతం- సామ్యవాదం.భాషాప్రయుక్థ, రాష్ట్ర విభజన,ఖద్దరుఫెదర్స్ అండ్ స్టోన్స్ ,హిందూహోమరీడిస్కవర్డ్,మొదలగు గ్రంధాలు రచించాడు.
రాజకీయ దక్షుడుగా పేరెన్నికగన్నప్పటికీ ఆయన పెద్ద పదవులను నిర్వహించలేదు. 1948లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. 1952లో మధ్యప్రదేశ్ గవర్నరుగా నియమింపబడ్డరు.1957 వరకు ఆపదవిని నిర్వహించారు.
1919లోజన్మ భూమి అనేఆంగ్ల పత్రికను స్థాపించి 1930 వరకు నిర్వహించారు. సమర్ధవంతమైన నిర్వహణ తీరును గమనించిన మోతీలాల్ నెహ్రు తన ది ఇండిపెండెన్స్ పత్రికను నడిపే బాధ్యతను అప్పగించారు.1938లో స్టేట్స్ పీపుల్ అనే మాస పత్రికను తన సంపాదకత్వం లో వెలువరించారు. మంచి వాదనాపటిమగల వ్యక్తి. 1917లో అనిబిసెంటు తో ఆంధ్రా కాంగ్రెస్ ను గూర్చి వాదించు సంధర్భమున 1921లో అహ్మదాబాద్లో పార్లమెంట్ సభ్యుడగు వెడ్జిఉడ్ తోచర్చించి నపుడు పట్టాభిని పెద్దలు ప్రశంశించారు. ఆయన ఉపన్యసాలు విలక్షణ వర్ణనలతోను, విఘ్ఙాన దాయకములై సామెతలతోనునిండి నిబిడీకృతములై ఉంటాయి. సంస్కృత ,హిందీ,ఉర్దూ భాషలలో కూడా ఉపన్యాసాలిచేవారు.
చిన్నతనంలో దరిద్ర్యం అనుభవించటం చేత డభ్భును.దుర్వినియోగం చేసేవారు కాదు. ఆయన చలోక్తిగా--ప్రకాసం గారికి రేపు అనేది లేదు .నాకు రేపు,ఎల్లుండి కూడా ఉన్నయి.
ప్రతి విషయాన్ని అతిసూక్ష్మం గా గ్రహిస్తాడు.విద్యుదుద్వేగంతో నిర్ణయాలు చేస్తాడు.మేధా సంపన్నులైన పట్టాభి గారు ఆరోగ్యం క్షీణించి 1959,డిసెంబర్ 17న కన్నుమూసారు.
బహు గ్రంధ కర్తగాను, మహావక్తగాను, ఆంధ్ర దేశంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకును స్థాపించినవాడు గాను.బహుముఖ ప్రఙాశాలిగాను,ఆంధ్రులహృదయాలలోనే కాక భరత ప్రజల అందరి హృదయాలలోను నిలిచిఉంటారు.
1994,నవంబర్న రేడియో ప్రసంగం చేయబడినది

Sunday, December 4, 2011

తొలి పొద్దు ఉషస్సులో
మలి పొద్దు హవిస్సులో
సగటు మానవుని తపస్సు
చెదరక అది కాగలదు యశస్సు
చెదిరిందా అది తమస్సు.