Friday, October 21, 2011

జీవనం

రాయాలని ఉన్నా
రాయలేని భావనైరాశ్యం
తనదికాని భావాన్ని ఎక్కడో వెతుక్కునే వెలితిని
సంధ్యారుణ కాంతులకై వెతికి చూచే విషాదాన్ని
భావదారిద్ర్యం పట్టి పీడించడం విచారమే
మనస్సే కందకం కాగా
పట్టు దొరక్క కాల్జారి పోతున్న పరాధీనతకు
పట్టు కావాల్సిన ఆవేశం,ఆలోచన
భరించలేని అవ్యక్తాలబరువుతో క్రుంగిపోతుంటే
కాలంతో పరిగెత్తలేను
పరుగెత్తి భీభత్స భయోత్పాతాలనుసృష్టించ లేను
చిక్కబట్టుకున్న మనస్సుతో
భావతాదాత్మ్యత చెందాలని
జీవనం జీవం ఉండేటట్లు చేయాలని భావించాను.

Thursday, October 20, 2011

నాయని subbaraau

అనుభవైకవేద్యము,హృదయరంజకము అయినకవితాకర్త నాయని సుబ్బారావు..నెల్లూరుజిల్లా పొదిలి గ్రామంలో20 అక్టొబర్1899 లోజన్మించారు. కుటుంబ వాతావరణం ఆయనకు కవితా సంస్కారం నేర్పింది.పినతండ్రి జానపదగాధలు బాగాతెలిసిన వాడు. గాంధీజీ పిలుపుతోచదువు మధ్యలోఆపిసహాయ నిరాకరణ వుధ్యమంలో పాల్గొన్నాడు. సౌభద్రుని ప్రణయ యాత్ర తోకవితారంభం కావించిన నాయని1925 నాటికి పూర్తిరూపాన్ని
ఇచ్చినారు,కులపాలికాప్రణయావిష్కారాన్ని భావ కవితా శాఖలో ప్రతిష్టించిన కవి.
యాత్ర అనే శబ్దాన్ని పలువురుకవులు వాడినప్పటికీ ప్రణయ యాత్ర అనినాయని తప్ప మరెవరు వ్రాసినట్లు కనబడదు.సుభద్రకుమారుడు సౌభద్రుడు.బలరాముడు తనకుమార్తెనుపాండవులు అఙాతవాసం లోఉండడంతో లక్ష్మన కుమారునికి ఇచ్చిచెయాలని అనుకుంటాడు.నాయనిప్రేమకధ దీనినిపోలిఉంటుంది.ప్రణయానికి వివాహమే సాఫల్యసిద్దిగాచెప్పబడుతుంది.అంతశ్రమపడి పావనమభ్రగంగ ధారుణికి తెచ్చినాడుభగీరధుడు. అన్ననాయని గీతంలో భావనాలోకవిహారీయిన ప్రణయం భౌతికలోకానికి తీసుకురావడం సూచితమైనది.ఫలస్రుతిలో మనముమేనత్తమేనమమలబలమ్ము అనితమది మేన సంబందమని భార్య వత్సల అనితెలియజేసినాడు. ఆమెను ఉపాసనాధిదే వతగా జీవనధాత్రిగా పరాత్పరంగావర్ణించినాడు.ప్రేయసికిప్రియునిహృదయం స్థానమని చెప్పి స్త్రీకి గల స్థానాన్ని ప్రాధాన్యాన్ని ధ్వనింపజేసినాడు.స్త్రీలేకుండా పురుషుడు యష్టి మాత్రుడు.ఆమెలేకుండాతడు యజ్ఙాదులు అతిధిదేవపూజలు చేయడానికి అనర్హుడని తెలియజేసినాడు .మల్లెపూవుగా,మలయ పవనంగా,గులాబిగా,పికముగా,సారసముగా, భ్రమరకాంతగా,వానచినుకుగా భావనచేశాడు. ప్రకృతి సౌందర్యమే తనప్రేయసి అని సూచన చేసినట్లుంది. అందుకే విశ్వనాధ ఒకలోకోత్తరమైన అనుభూతి వచ్చేటప్పటికి అతని గీతాశక్తి పండిన దానిమ్మ కాయవలె పగిలింది అంటారు.తల్లి మరణించిన దుః ఖంలో మాతృగీతాలు వ్రాసారు. ఎవ్వడాక్రూరకర్మట్టుడు ఎవడునీల జలద నిర్ముక్త శైశిర శర్వరీ ప్రశాంత మలవాటు పడిన నిశాంత మందు అకటనట్టింట దీపమ్ము నార్పినాడు.అని దఃఖించినాడు.కుమారుని మరణం విషాదమోహనంగా వెలువడినది.తన జన్మస్థలం పొదిలి చుట్టూ అల్లబడిన కావ్యం జన్మభూమిని1960లో వ్రాసారు. భారతీయసంస్కృతి జాతిజీవనవిధానం అభివ్యక్తం కావడం వలన ప్రతి భారతీయుదు తన జన్మభూమిని ఇందు దర్సించవచ్చు.నాయని మితభాషి. శాంతిప్రియుడు.మంచిహాస్యప్రియుడు. రేడియోలో పనిచేసినాఇదు సంవత్సరాలకాలంలో అనేక నాటికలు కథలు, పాటలువ్రశారు.వలపులో,విరహంలో, వేదనలోమాతృప్రేమలోఈయన కవిత్వానికిహృదయంగీటురాయి.ప్రతిపదంలోనుజీవిస్తారు.అందుకేనాయని గీతాలు ఉజ్జ్వలములు,ఉన్నతములు ఈరోజు నాయని జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం.

Sunday, October 2, 2011

వార్త

ఇరవైనాలుగు గంటల న్యూస్ చానల్స్ వచ్చినాక వార్తలకు కొదువ లేదు.అప్రస్తుతమైనది ,అనవసరమైనవిషయాలు ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.ఈ రోజు ఆంధ్ర జ్యొతి చానల్ లో చూపిన వార్త మన ముఖ్యమంత్రి
గారు గాంధి సమాధికి నివాళులు అర్పించటానికి వెళ్ళి తూలిపడబోయారట అది వార్త అదే విషయాన్ని రివైండ్ చేసి పదేపదే ఆ క్లిప్పింగ్ చూపవలసిన అవసరము ఉన్నదా?అది అంత ముఖ్యమైన విషయమా?హైలెట్ చేసి చెప్ప టానికి.వ్యక్తుల జీవితాలలోకి తొంగి చూడటం అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటైపోయింది. అది ఎదుటివారికి ఎంత ఇబ్బందిని కలుగ చేస్తుందో అన్న ఆలోచన ఎంతమాత్రం ఉన్నట్లు కనిపించదు.కనీస విలువలను సంస్కారాన్ని కూడా పాటించటం లేదు .అన్ని చానల్సు ఇంచు మించు అలాగే ఉన్నాయి.