Thursday, November 18, 2010

manchi maaTa

మంచితనాన్ని ఎవరూ ఎక్కువ కాలం నటించలేరు.ఒక వేళ అలా నటిస్తే వారు తమది కాని జీవితాన్ని గడుపుతున్నారన్న మాట.వారు జీవన్మృతులు.

Wednesday, November 17, 2010

manchi maaTa

ఈర్ష్య,అసూయావున్న వారు వారే దహించ బడతారు కాని అనుమానం ,అహంకారం వున్నవారి వలన ఇతరుల జీవితాలు,మనసులు అల్లకల్లోలం ఔతాయి.

Tuesday, November 16, 2010

మంచి మాట
ఎవరి కడుపుకి పట్టినంత వారు తింటారు.ఎవరు కాళ్ళు జాపుకో గలిగినంత మేర వారు పడుకోగలరు. అంతే గానివున్నది కదాని ఎక్కువా తినలేరు పెద్ద మంచం కదా అని మంచం అంతా పడుకోలేముకదా !
మంచి మాట
ఎవరి కడుపుకి పట్టినంత వారు తింటారు.ఎవరు కాళ్ళు జాపుకో గలిగినంత మేర వారు పడుకోగలరు. అంతే గానివున్నది కదాని ఎక్కువా తినలేరు పెద్ద మంచం కదా అని మంచం అంతా పడుకోలేముకదా !

Tuesday, November 9, 2010

మాతృభాష

ఇది అమ్మ భాష
అనాదిగా వస్తున్న భాష
అఙ్ఞాన అంధకారాన్ని పారద్రోలి
శరత్ జ్యోత్స్న లనునింపి
దేశ భాషలందు అగ్రపీఠాన్ని అలంకరించినది
సాహితీ ప్రపంచములో నడిపించి
నను సాహితీ పిపాసిగా చేసినది
అభావమూర్తినైన నన్ను
భావనాలోకంలో విహరింప జేసింది
అమ్మ అరటి నుండి
ఆముక్తమాల్యదల వరకు
అక్షర జగత్తులో ఓలలాడించినది
తెలుగు వారందరినీ ఒక త్రాట నడపి
భాషా సమైఖ్యతకు దారి చూపిన
తేనెలొలుకు తెలుగు
నా మాతృభాష.

Sunday, November 7, 2010

కార్తీక మాస ప్రాధాన్యత

కార్తీక మాస ప్రాధాన్యత
దీపావళి మరునాటి నుండి అనగాకార్తీకమాస శుధ్ధపాడ్యమి నుండి కార్తీకమాసం ప్రారంభమౌతుంది.శివ,విష్ణు భక్తులిద్దరికీ ఈమాసం పవిత్రమైనదే.విష్నుసహస్ర నామార్చన ,శివలింగార్చనలు ప్రధానంగా చేస్తారు.హరిహరాదులకు భేదం లేదని చెప్పటమే దాని ఉద్దేశ్యము.మహావిష్ణువుకి తులసిదళములతో ,శివునకుబిల్వపత్రాలతో సహస్రార్చన చేసిన జన్మరాహిత్యము కలుగునని నమ్మకము.
సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం కాబట్టి గంగామాత నీరు ఉన్న ప్రతిచోట కొలువై ఉంటుంది.ప్రతినీటిబొట్టు పవిత్రమైనదే.సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తూ ఈశ్లోకాన్ని చదవాలి .
"గంగే చయమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదాసింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు."-
అని పఠిస్తే స్నానఫలం దక్కుతుంది.నదీ స్నానం శ్రేష్ఠం.కార్తీక సొమవారము ,పౌర్ణమి రోజులలో నదీస్నానము చేసిన అత్యంత ఫలితమునిచ్చును.
కార్తీక సోమవారములు శివునికి ప్రీతికరమైన రోజులు .సూర్యొదయానికి ముందే స్నానము చేసి భగవంతుని పూజించి ఉదయమంతా ఉపవాసముండి సాయంత్రం శివాలయం లోగాని, విష్ణువాలయములో గాని తులసి చెట్టుముందు ఆవు నేతితో దీపం వెలిగించి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసిన మోక్ష ప్రాప్తి కలుగును.
ఈ మాసములో చేసినచేసే ఏ దానమైనా ఫలితాన్నిస్తుంది. దీపాదానము, కన్యాదానము మరింత ఫలాన్ని అందిస్తుంది. బియ్యపుపిండి గోధుమపిండితో ప్రమిదను చేసి వత్తిని పెట్టి ఆవు నేతితో వెలిగించి ఆదీపమును యోగ్యునకు దానమిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి.
"సర్వఙ్నాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం
దీపదానం ప్రదా స్యామి శాంతిరస్తు సదామమ."""
కార్తీకమాసమంతా పూజ చేయలేని వారు మొదటి రోజయిన శుధ్ధ పాడ్యమి మధ్య రోజయిన పౌర్ణమి,చివరి రోజు చతుర్ధశినాడు సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానము చేసి శికేశవులను అర్చించిన మాసమంతా భగవంతుని ఆరాధించిన ఫలము దక్కును. కార్తీకపురాణ పఠనము,శ్రవణముకూడా సర్వ పాపహరణమే. కార్తీక శుధ్ధ ద్వాదశీ దినమున దీపదర్శనము వలన సంపూర్ణాయువు,బుధ్ధిబలము ధ్ధైర్యము కలిగి మోక్షము లభిస్తుంది.
వనభోజనాల ప్రత్యేకత చెప్పనక్కరలేదు.చిన్నా పెధ్ధా ధనికబీదా తారతమ్యము లేకుండా సామూహికంగావనంలో ఉసిరిచెట్టు కిందసాలగ్రామ రూపంలోఉన్న శ్రీమహావిష్ణువును తులసిదళాలతో పూజించి భగవన్నామ స్మరణ చేసి బంధుమిత్ర సహితంగా భోజనం చేసిన పుణ్యలోకప్రాప్తి లభించును.ఐహికాముషికికానందాన్ని కలుగజేయును.భయముతోనో మొక్కుబడిగానో చేసే పూజ వ్యర్ధము. నిశ్చల భక్తితో సంపూర్ణ విశ్వాసముతో చేసిన చక్కని ఫలమును పొందవచ్చును
సర్వే జనా సుఖినో బవంతు.

Tuesday, November 2, 2010

మౌనం

మౌనం ఎంత అర్దవంతమైన పదము. మౌనంగా ఎదగమని మొక్క చెప్పినా,మౌనం అర్దాంగీకారమైనా అది ప్రత్యేకమైన పదమే.ఎందుకంటేమౌనంగా ఉండటంవలన ఎన్నో వాగ్వివాదాలను ఆపవచ్చు.ఒకోసారి మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించవచ్చు .అందుకే కవులు తమకవిత్వంలో ఆపదానికి ప్రాముఖ్యతనిచ్చారు . మౌనమె నీ భాష ఓ మూగ మనసా అనీ ,మౌనమేలనోయీ ఈ మరపురానిరేయి ,ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు .మౌన రాగాలు,పలికినా మౌన పోరాటాలు చేసినా బంధనాలు పెంచుకోవటానికే.వ్రతాలలో మౌనవ్రతం శ్రేష్టత అందరికీ తెలిసినదే .గాంధీజీ అందుకే తన నిరసన తెలపటానికి మౌనవ్రతాన్ని ఎంచుకున్నాడు .పెద్దల మృతికి రెండు నిముషాలు మౌనం పాటించడం వారికి మనం ఇచే నివాళి .ఇక మౌనానికి విరామ ము ఇద్దామా?

Thursday, September 16, 2010

vEdana

vమానవత్వం మృగ్యమై మనిషి మృగమైన వేళ సజీవదహనాలకు కొదవేముంటుంది.ప్రాణాలకు విలువేమున్నది.శాస్త్రవిఙానమెంత అభివృద్ది చెందినామారుమూల గ్రామాలలోప్రజల మూఢనమ్మకాలలో మాత్రం మార్పు లేదనడానికి ఈరోజు జరిగిన వృద్దుల సజీవ దహనమే తార్కాణము. ఎంత హృదయవిదారకము.ఆముసలి ప్రాణాలు ఎంత విలవిల లాడాయో కదా!
అమ్మతనాన్ని కూడా శంకించాల్సిన దుస్థితి ఈ మనుషుల్ని రక్షించటానికి ఆభగవంతుడే రా వాలేమో. శరీరానికి మనసుకి ఏ దెబ్బ తగిలినా తొలిగా నోటినుంచి వ చ్చేది అమ్మ అన్న పిలుపు.ఆ అమ్మే కాటేయాలని చూస్తే ఎవరికి చెప్పుకోవాలి. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడంటారు.ఆమే శాపమైతే? ఎవరికి మొరపెట్టుకోవాలి?ఈ దురాగతాలకు మానసిక దౌర్భల్యమే కారణమా లేక కోర్కెలే కారణమా ?ఇది పురోగమనమా?తిరోగమనమా? ఎటుపోతోంది మానవజాతి?తాను మనిషన్న మాట మరచి జంతు న్యాయాన్ని అనుసరిస్తున్నాడేమో? నర్తించాల్సిన పాదాలు వాతలతో ఎర్రబారితే ఎవరి మనసు ద్రవించదు. ఆచిట్టితల్లి అడిగిందా తనను కనమని. ఆ కళ్ళు మూగగా ప్రశ్నిస్తే ఆతల్లి ఏమని సమాధానం చెప్తుంది? ఈరోజు పెపరులోవార్తలు చదివి నావేదనని ఈనాలుగు మాటలలో వ్యక్త పరిచాను.

Tuesday, September 7, 2010

పబ్లిక్ న్యుసెన్సులు

అంటె ఏమిటి అనుకుంటున్నారా?మనం పబ్లిక్ లోకివెళ్ళినప్పుడు మనకే కాక అందరినియిబ్బంది పెట్టెవి.
ఉదాహరణకితుమ్ములు దగ్గులు అందరికి వస్తాయను కోండి కాని వారి మౌత్ ఫౌంటైన్ తో మనల్ని తడిపారనుకోండి అదన్నమాటన్యుసెన్స్.జర్దనొ ,కిళ్ళినో నోట్లో ఉన్నదనుకోండి అప్పుడు చూడాలి మన పాట్లు.బిక్కమొహమెసుకొని ఏడవలేక నవ్వాలి.విందు భోజనానికి వెళ్తామా మనపక్కనే కూర్చొని భోజనం చేస్తుంటారు .మీరెప్పుడైనా ఆవులు నెమరువేయడం చూసారా? అందుకుభిన్నంగా వుండదు ఈ సీను .తమ ముందున్న పదర్థా లను కసపిసా పచగడ్డిలాగా నమిలే స్తుంటారు. ఆశబ్దం గ్రైండరు శబ్దా నికి ఏమాత్రం తీసిపోదు.అదిభరించలేక ఏదో ఒకటి తిన్నామనిపించి లేచిపోవల్సిందే . ఆంతేనా మరికొందరుంటారుఎంత జనకూడళ్ళైనాసరేరోడ్డుపక్క తమ నేచురల్ కాల్స్ తీర్చుకోవల్సిందే.అది వారి జన్మ హక్కుగా ,ఆరోడ్డు వారి బాబు గారి సొత్తుగా భావిస్తారు.
చచ్చీ చెడీ కార్పోరేషన్ వాళ్ళు చెట్లు పెంచుతారా మన సేవే వారిధ్యేయమన్నట్లు పత్రాలు పుష్పాలు మన ఇళ్ళకు చేరి పొతాయి. పట్టణ సౌందర్యం గృహ సౌందర్యంగా మారిపోతుందన్నమాట. వానొస్తుందా రోడ్డేదో గుంటఏదో అని మనం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నడుస్తుంటామా ఏ నాలుగు చక్రాల వారో డబుక్కున గుంటలో బండిని జర్రునపోనిస్తారు మనం బురద స్నానం చేయాల్సిందే.ఎంత గొప్ప పని మీద వెళ్ళే వారమైనా వెనక్కు రావాల్సిందే .ఇంతేనా ఇంకా చాలా వున్నాయి ఇల్లాంటి
పబ్లిక్ న్యుసెన్సులు .మరల ఎప్పుడైనా చెప్పుకుందాము.

Sunday, June 13, 2010

మనిషి

ప్రకృతి లొని ఏ వస్తువు
ప్రతిఫలాపేక్ష కోరదు
అలక పూనదు
అతి రసఫలవృక్షము
తనపై రాళ్ళు వేసినా
ఫలాలనే యిచ్చును
కొమ్మలు నరికినా
మూతి ముడవక
నీడనే యిచ్చును.
నది కాలుష్యకోరలు
కాటు వేస్తున్నా
సుజలాన్ని అందిస్తుంది
సుమ సుగంధము
పాప పుణ్యభేదము లేక
అందరికీ పంచును
అన్నీ తానైన మనిషి
స్వార్ధమే వూపిరిగా
మానవతను మరుగున
పడవేసి మాలిన్యానీ
మనసు నిండానింపుకొని
ప్రకృతి లోని ఏ వస్తువు తో
పోల్చ వీలులేకున్నాడు.

Friday, June 4, 2010

సమైక్య భాష

తెలుగు భాష
ఒంపు సొంపుల భాష
శ్రీకాకుళం తెలుగు
సిరులొసగు భాష
విజయనగరం తెలుగు
విజయచిహ్న మైన భాష
విశాఖపట్నం తెలుగు
ఆణిముత్యమైన భాష
తూర్పుగోదావరి తెలుగు
కోనసీమ నారికేళమైన భాష
పశ్చిమ గోదావరి తెలుగు
పనస తొనలవంటి భాష
కౄష్ణా తెలుగు
కౄష్ణ వేణీ తరగల
స్వచమైన భాష.
గుంటూరు తెలుగు
ఘాటైన చిక్కని భాష
ప్రకాశం తెలుగు
ప్రకాశవంతమైన భాష
నెల్లూరు తెలుగు
జాణతనమబ్బిన
భాష
చిత్తూరు తెలుగు
అన్నమయ్య పదముల
విరాజిల్లు భాష
కడప తెలుగు
కఠిన పదముల భాష

Friday, May 14, 2010

అమ్మ

అమ్మ అంటే
అవ్యక్త భావన
అంతులేని అనురాగం
ఆమె మమకారం
ఎవరెష్టు శిఖరం
వాత్సల్యం
కనిపించని అగాధం
సౄష్టిలో ఆమెకు
సాటిమరెవరూ లేరు.

Thursday, May 13, 2010

సూక్తి

వణికే చేత్తో గీసె అగ్గిపుల్ల
వెలుగుతుంది కాని వెలిగించదు
జడిసీ కాళ్ళతో కదిలే ఉద్యమం
నదుస్తుంది కాని నడిపించదు. ---.సినారె

Saturday, May 8, 2010

చదువు

చదువంటే అ,ఆలు కాదు
చదువు అనంతం
ఎవరెష్టు శిఖరం
ప్రకౄతిలో అణువు అణువూ
ఆశ్చర్యమే,ఆనందమే
గిరులు,తరువులు,
వాహినులు,వారధులు
తమని చదవమంటాయి అంతుచూడమంటాయి

Friday, May 7, 2010

మన తెలుగు వెలుగు

మాతృభాష పై మమకారాన్ని మరుగున పడనీయకు
తౄణీకరించవద్దు తృణప్రాయంగా చూడవద్దు
వెదజల్లు నలుదిశల భాషాసౌరభాలను
షడ్రుచులలోతెలుగు చమత్కృతి ఉంది
అలతి అలతిపదముల అనల్పార్ధరచన తెలుగు
పాటలు పద్యాలు అవథాన ప్రక్రియలు !
నన్నయ తిక్కన పెద్దనాదుల సేవలందుకున్నభాష !
వాణియే నారణి అన్న వీరభద్రుని విజయ చిహ్నమైన భాషా !

Thursday, May 6, 2010

వినాయకస్తుతి

నమో వినాయక నమోస్తుతే
సర్వవిఘ్నములు తొలగించుమా
నను బ్రోవుమా !