Wednesday, December 31, 2014

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు
     "  నూతన  సంవత్సరములో  అందరికీ శుభాలు  జరగాలని ఆకాంక్షిస్తున్నాను."

Monday, December 29, 2014

సజ్జలడ్డు:-

సజ్జ లడ్డు:-
     సజ్జలు---------------------1/4కెజి
     బెల్లం--------------------1/4కెజి
     ఎండు కొబ్బరి----------1/2చిప్ప
    నెయ్యి----------------------150గ్రాములు
    గస గసాలు------------1/2కప్పు

               సజ్జలు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.గసగసాలు కూడా పొడిచేసుకోవాలి.కొబ్బరి కోరుకోవాలి.సజ్జ పిండిని  బాణిలిలో నెయ్యి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత ఒక గిన్నెలో  బెల్లం 3/4 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే దాకా ఉడికించుకొని  అందులో వేయించి పెట్టుకొన్న సజ్జ పిండి,గసగసాల పొడి,కొబ్బరి  కోరు వేసుకొని ఉండలు కట్ట కుండా బాగా కలియ తిప్పుకొని దించుకోవాలి.చల్లారాక లడ్డూలు చుట్టుకోవాలి.జీడి పప్పు పలుకులను కూడా చేర్చు కుంటే మరింత రుచిగా ఉంటాయి.

Tuesday, December 23, 2014

జొన్న రవ్వ ఉప్మ:--



    జొన్న రవ్వ-----------------1కప్పు
    పెసర పప్పు---------------1/2కప్పు
    నూనె-------------------------4స్పూన్లు
    నీళ్ళు--------------------------3కప్పులు
    పచ్చి మిరప--------------4
    అల్లం---------------------------చిన్న ముక్క
    కరివేపాకు-----------------2రెమ్మలు
    పోపుకి:--ఆవాలు,మినపపప్పు ,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు
     ఉప్పు--రుచికి సరిపడ
               ముందుగా ష్టౌ మీద పెట్టి  నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి  చిట పట లాడాక ,అల్లం పచ్చి మిర్చి ముక్కలు వేగాక కరివేపాకు వేసి  పెసర పప్పు కూడా వేసి కొంచెం వేయించి మూడు  కప్పులు నీళ్ళు పోయ్యాలి.అవి  కాగాక  జొన్న రవ్వ పోస్తూ తిప్పాలి.రుచికి సరిపోను ఉప్పు వేసి సన్న సెగ  లో పది నిముషాలు  నిదానంగా మగ్గనివ్వాలి.బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ కంటే ఎక్కువ సమయం పడుతుంది. కాని వాటి కంటే రుచిగా ఉంటుంది.
     పెసర పప్పు బదులు  తోట కూర,పాల కూర ఏదైనా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.

Sunday, December 21, 2014

 17.  మహోగ్రః పూర్వతః పాతు మహా వీరాగ్ర జోగ్నితః|
        మహా విష్ణు ర్ధక్షిణేతు మహాజ్వాలస్తునైర్నతౌ||

 18. పస్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతో ముఖః|
       నృసిమ్హః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణ విఘ్రః||

 19. ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళ దాయకః|
       సంసార భయదః పాతు మృత్యోర్మృత్యుర్నృ కేశరీ||

 20. ఇదం నృసిమ్హ కవచం ప్రహ్లాద ముఖ మండితం|
       భక్తి మాన్యః పఠేన్నిత్యం సర్వ పాపైఅః ప్రముచ్యతే||

 21.పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే|
      యం యం కామయత్ కామం తం తం ప్రాప్నోత్య సంశయం||

 22. సరవత్ర జయమాప్నోతి సరవత్ర విజయీ భవేత్|
      భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణా వినినావరణం||

 23.వృశ్చికోరగ సంభూత విషాపహరణం పరం|
      బ్రహ్మ రాక్షస యక్షాణాం దూరోత్సారణ కారణం||

  24.భూర్జేవా తాళ పత్రేవాకవచం లిఖితం శుభం|
       కర మూలే ధృతం యేన సిధ్యేయూః కర్మ సిధ్ధయః||

  25.దేవాసుర మనుష్యేషు స్వంస్వమేవజయం లభేత్|
       ఏక సంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః||

   26.సర్వ మంగళ మాంగల్యం భుక్తిం ముక్థిం చ విందతి|
       ద్వా త్రింశతి సహస్రాణి పఠేచ్చుధ్ధాత్మనాం నృణాం||

   27.కవచస్యాస మంత్రస్ య మంత్ర సిధ్ధీః ప్రజాయతే|
       అనేన మంత్ర రాజేన కృత్వా భస్మాభి మస్త్రణం||

   28. తిలకం విన్య సేద్యస్తు టన్య గ్రహ భవ్యం హరేత్|
        త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్యచ||

   29.ప్రాశ యోద్యో నరోమంత్ర నృసిమ్హ ధ్యన మాచరేత్|
        తస్య రోగాః ప్రణశ్యంతి యే చన్యూఃకుక్షి సంభాః||

   30.కిమత్ర బహునోక్తేన నృసిమ్హస దృశో భవేత్|
       మనసా చితితం యత్తు సతచ్చాప్నోత్య సంశయం||

   31. గర్జంతం గర్జయంతం  నింజ భుజ పటలం స్ఫోటయంతం హటంతం|
         రూప్యంతం తాపయంతం దివి భువిదితిజం క్షేపయంతం క్షిపంతం||

   32. క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సమ్హర్తనం భర్తనం|
        వీక్షంతం ఘార్ణయంతం శరనికరశతై ర్ధివ్య సిమ్హం నమామి||

  

Saturday, December 20, 2014

శ్రీశ్రీ నరసిమ్హం కవచం:-

శ్రీ నరసిమ్హం కవచం:-
      1.నృసిమ్హ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా |
         సర్వ రక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం||

      2.సర్వ సంపత్కరం చైవ స్వర్గమోక్ష ప్రదాయకం|
         ధ్వాత్వా నృసిమ్హం దేవేశం హేమసిమ్హాసనస్థితం||

      3. వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం|
          లక్ష్మ్యా లింగితవామాంగం విభూతిభిరుపాశ్రితం||

      4.చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శొభితం|
         ఉరోజ శోభితో రస్కం రత్నకేయూర ముద్రితం||
     
      5.తప్త కాంచన సంకాశం పీట నిర్మలవాససం|
         ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభీః||
   
     6.విరాజిత పద ద్వంద్వం శంఖచక్రాది హేతిభీః|
        గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితం||

     7.స్వహృత్కమల సంవాసం కృత్వాతు కవచం పఠేత్|
        నృసిమ్హో మే శిరః పాతు లోకరక్షాత్మ సంభవః||

     8.సర్వ గోపిస్తంభ వాసః పాల  మే రక్షతు ధ్వనిం|
        నృసిమ్హో మే దృశౌ పాతు సోసూర్యాగ్ని లోచనః||

      9.స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతి ప్రియః|
         నాసాం మే సిమ్హనాసస్తు ముఖం లక్ష్మీ ముఖప్రియః||

     10.సర్వ విధ్యాధిపః పాతు నృసిమ్హో రసనాం మమ||
          వక్త్రం పాత్విందు వదన స్సదా ప్రహ్లాదవందితః||

     11.నృసిమ్హః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్|
          దివ్యాస్త్ర శోభిత భుజో నృసిమ్హః పాతుమే భుజౌ||

    12.కరౌ మే దేవవరదో నృసిమ్హః పాతు సర్వతః|
         హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరీః||

    13.మద్యం పాతు హిరణ్యాక్ష వక్షః ఖుషిరొ విదారణః|
         నాభిం మే పాతు నృహరి స్స్వనాభిబ్ర్హ్మ సంస్తుతః||

    14.బ్ర్హ్మాండ కోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం|
         గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్య రూపధృత్||

    15.ఊరు మనోభవః పాతు జానునీ నరరూప ధృక్|
         జంఘే పాతు ధరా భార హర్తాయో సౌనృ కేసరీ||

    16.సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః|
         సహస్ర శీర్షా పురుషః పాతు మే సర్వశస్తమం||
        
(  తక్కిన 16 శ్లొకాలు రేపు పోష్టు చేస్తాను ) 
   

Friday, December 19, 2014

పొట్లకాయపొడికూర


    పొట్ల కాయ.    --1
    కంది పప్పు   ---1/4 కప్పు
    నూనె.           ----2 స్పూన్లు
    ఉప్పు.       ------రుచికి సరిపోను
   కారం. --------11/2 స్పూన్లు

    మినపపప్పు,జీర,ఆవాలు-తిరగమోతకు
    వెల్లుల్లి-------4రెబ్బలు
    కరివేపాకు--2రెబ్బలు

             ముందుగా కందిపప్పు మరీ మెత్తగా కాకుండా పలుకులకు ఉడకబెట్టు కొని పక్కన పెట్టు కోవాలి.పొట్ల కాయ సన్నగా ముక్కలు తరుగుకొని  ఒక పొంగు రానిచ్చు కోవాలి.

ష్టొవ్ మీద బాణిలి పెట్టి  నూనె వేసి కాగినాక తిరగమోత దినుసులు వేసి చిట పట లాడాక కొంచెము చితగ కొట్టి వెల్లుల్లి రెబ్బలు  తరువాత కరివేపాకు వేసి  కాలినాక  పొట్లకాయ ముక్కలు మీరు పిండి వేయాలి.కొంచెం వేగాక ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి,సరిపోను ఉప్పు,కారం వేసుకొని రెండు నిముషాలు వేయించుకొని దించుకోవాలి.అంతే  పొట్లకాయ కందిపప్పు పొడికూర తినతానికి సిధ్ధం.

Thursday, December 18, 2014

6.పుదీనా:-
   గాస్,అజీర్తి,తిమ్మిర్లు,డ్యేరియాలను తగ్గిస్తుంది.కండరాలను పటిష్ట పరుస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.రోజూ ఒక కప్పు పుదీనాటీ తాగినట్లైతే కాన్సర్ ని దూరం చేయవచ్చు.

2.రోజ్ మేరి:-
    మధ్యధరా సముద్రం ప్రాంతంలో లో దొరికే వీటి ఆకులు సన్నగా పొడవుగా వుంటాయి.వీటిని సునుప్,టమోటా సాస్,బ్రెడ్,మాంసాహారాలలో హారాలలో వాడతారు.మంచి  యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.అజీర్ణానికి సంబంధించిన సమస్య లన్నిటికీ మంచి మందు.మూడు కప్పులు  రోజ్ మేరి టీ ని ప్రతి రోజూ తీసుకుంటే కాన్సర్ కు దూరం కావచ్చు.

సీమ చేమంతి :-
  నిద్ర సమస్యకు చక్కటి  పరిష్కారం.నిద్ర పోయే ముందు చిక్కటి సీమ చేమంతి టీ తాగినట్లైతే నిద్ర బాగా పడుతుంది.జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.కండరాలు ముడుచుకు పోకుండా ను కండరాల సమస్య తీవ్రతను తగ్గిస్తుంది.కీమో థెరిపీ,రేడియేషన్ తరువాత ఏర్పడే నోటి పుళ్ళకు సీమ చేమంతి మౌత్ వాష్ తో పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది.సీమ చేమంతి టీ తాగినట్లైతే కాన్సర్ కి దూరం కావచ్చు.

   ( వీటి  లో కొన్నిటినైనా పాటించి నట్లైతే  కాన్సర్ ముప్పు నుంచి బయట పడవచ్చు. ఓక వేళ  కాన్సర్ బారిన పడినా నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.) 

వెల్లుల్లి:-
   వెల్లుల్లి లో అర్జినిన్,అలిగొశాచరిడెస్,ఫ్లేవొనాఇడ్స్,సెలీనియం ఉంటాయి.ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.పెధ్ధ పేగు,అన్నవాహిక,పాంక్రీస్,బ్రెష్ట్ కాన్సర్ ల  నివారణ లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఇమ్యూనిటీ ని పెంచడం లోనూ,బ్లడ్ ప్ర్షర్  తగ్గించడం లోనూ ఉపయోగ పడుతుంది.

Wednesday, December 17, 2014

4.చిలీ పెప్పర్:-
     ఇది కాప్సిసిన్  లో ఉంటుంది.నొప్పి నుండి ఉపశమనాన్ని కలుగజేస్తుంది.కాన్సర్ నివారణకు ఉపయోగించవచ్చు. కాన్సర్  సర్జరీ తరువాత నొప్పి నుండి ఉపశమనానికి కాప్సిసిన్  క్రీం వాడాలి.

3.పసుపు:-
    కూరలలో పసుపు వాడే అలవాటు మనకి ఉన్నది.కొన్ని వంటలలో రంగు కోసం కూడా వాడతారు.యాంటీ ఆక్సిడెంట్ గా,నొప్పి నివారణకు ఉపయోగ పడుతుంది.ముఖ్యం గా పెద్ద పేగు,ప్రొష్టేట్,బ్రెష్ట్ ,చర్మ కాన్సర్ నివారణకు పనిచేస్తుందని వైద్య పరీక్షలలో తేలింది.

కాన్సర్ నివారణకు:-
        ఆధునిక కారం లో కాన్సర్ వివిధ రూపాలలో జనాల్ని భయాందొళనలకు గురి  చేస్తోంది.అది రాకుండా నివారించడానికి కొన్ని ఆహారపదార్ధాలు ఉపయోగ పడతాయి.అవి ఏమిటో చూధ్ధాము.
  
 1.అల్లం:-మనం అల్లం పేష్ట్ కొన్ని వంటలలో ఉపయోగిస్తాము.ఒక స్పూన్ తాజా అల్లం తురుము తరచుగా తీసుకుంటే కాన్సర్ నివారణగా పనిచేస్తుంది.అంతేగాక జలుబుకి,అజీర్తికి కూడా మంచి మందు.

అమానుషం:-


         చిరు దరహాసాలతో,కొటి కలలతో
         బడిలో అడుగుపెట్టిన వారికి తెలియదు
         తమ హాసాన్ని,కలల్ని కాలరాసే
         ముష్కరులు పొంచి ఉన్నారని
        
         హటాథుగా చొరబడిన ఆగంతుకులను
         ఆస్చ్ర్యంగా చూస్తుండగానే
         క్షణాల్లో అసువులు అనంత వాయువులో
         కలిసిపోతుంటే 
         ఏమి జరుగుతోందో,ఏం చెయ్యాలో తెలియని
         పాపం,పుణ్యం ఎరుగని అమాయుకులు
         తోటి వారు కనులముందు నేలకొరుగుతుంటే
         ఎంతగా అలమటించారో

         పసరు మొగ్గలను పాశవికం గా
         నలిపేసి
         తల్లి తండ్రుల ప్రాణాలు 
         ఉండీ లేనట్లుగా చేసి
         పిల్లలపై వారి ఆశలను అడియాశలు చేసి
         గుండెలలో చిచ్చును రగిల్చి
         ఎప్పటికీ తీరని దూఃఖాన్ని మిగిల్చి

         ప్రభుత్వ చర్యకు ప్రతిచర్యగా
         తమ ప్రాణాల్నే ఫణం గా
         పెట్టాలన్న సత్యం తెలియని
         సత్తెకాలం పిల్లలు
         పాఠశాల ప్రాంగణమే
         వారికి మరణశాసనమౌతుందని
         మరుభూమిగా మారుతుందని
        ఆ తల్లి కి తెలియదు
        తెలిస్తే
        ఏ తల్లీ తమ బిడ్డను బడికి పంపదు.
         చదివి ఏ వూళ్ళూ ఏలక్కర లేదు
        తమ కళ్ళ ముందర తిరగాడితే చాలని
       గుండెల్లో దాచుకుంటుంది
       బిడ్డల్ని కోల్పోయిన
      ఆ తల్లుల గర్భ శోకం తీర్చగల
      మంత్రదండ మేదైనా ఉంటే బాగుండు
      కాలాన్ని మించిన మంత్రదండ మేముంటుంది?
     అది మీ గాయాన్ని మాంపి
      మిమ్ము మిమ్ము గా నిలబెట్టే  రోజు
     త్వరగా రవాలని ప్రార్ధించడం కంటే
     మేము ఏం చేయగలం?

       (ఉగ్రవాదుల దాడులలో అశువులు బాసిన పిల్లలకు నివాళులు) 



     
  
         

Wednesday, October 22, 2014

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు
      ఈ దీపావళి  అందరికీ వెలుగుల్ని పంచాలని, ఆనందాన్ని ఇవ్వాలని  భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

Monday, October 20, 2014

మష్రూంఫ్రై:---

మష్రూం ఫ్రై:--
     మష్రూం----------- -----250 గ్ర
     కొబ్బరి--------------------1/4 కప్పు
     అల్లం,వెల్లుల్లి పేష్ట్------1 ట్బ్ల్ స్పూన్
     పచ్చి మిరప----------2
     ఉప్పు,కారం--------------సరిపోను
     నూనె----------------------2ట్బ్ల్ స్పూన్లు
     కొత్తిమీర, కరివేపాకు కొంచెము
     జీర, మినపపప్పు, ఆవాలు  తిరగమోతకు.
                    ముందుగా మష్రూం శుభ్రం గా కడుగుకొని  కట్ చేసుకోవాలి.వాటిని  మునిగేటట్టు నీళ్ళు పోసి  ఉడకబెట్టాలి.తరువాత ష్టౌ మీద బాణిలి పెట్టి  నూనె వేసి కాగినాక తిరగమోత్ దినుసులు కరివేపాకు వేసి కాలినాక ఉడకబెట్టిన మష్రూం వేసి కొంచెము సేపు సన్న సెగ మీద వేయించి  అల్లం,వెల్లుల్లి పేష్ట్,ఉప్పు వేసి వేయించి నాక కారము ,కొబ్బరి  వేసి రెండు నిముషాలు  తిప్పి దించేయాలి.కొత్తిమీర సన్న గా కట్ చేసి పైన జల్లుకోవాలి.

Saturday, October 18, 2014

యుధ్ధభూమికివ్యూహములు:-


            మహా భారత యుధ్ధం పద్దెనిమిది రోజులు జరిగింది.దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.కురు పాండవులు ఇరువురు అనేక వ్యూహాలు పన్నారు.ఆ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బ కొట్టటానికి,మరికొన్ని సమ్రక్షణ వ్యూహాలుగా ఉన్నాయి. వాటి పేర్లను చూద్దాము.
         మానుష వ్యూహము దీనినే అచల వ్యూహమని కూడా అంటారు.
         క్రౌంచ,గరుడ,అర్ధ చంద్ర,మకర,శ్వేన,మండల,వజ్ర,కూర్మ,శృంగాటక,సర్వతోభద్ర,శకట,మండలార్ధ,పద్మచక్ర,దుర్జయ వ్యూహములు.
            మన అందరికీ బాగా తెలిసిన వ్యూహము పద్మవ్యూహము.సేనను నిలబెట్టే విధానాన్ని బట్టి  వ్యూహాలు మారతాయి.పద్మ వ్యూహ చిత్రాన్ని కింద చూడండి.


Thursday, October 16, 2014

భారతపద్యము


    శా. సింగంబాకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
            తంగ స్ఫూర్జిత యూధదర్సనసముద్యత్క్రోధమై వచ్చునో
            జం గాంతార నివాస ఖిన్నమతి న్స్మత్సేనపై వీడె వ
            చ్చెం గుంతీసుత మధ్యముండు సమర సేమాభి రామాకృతిన్.

                       పాండవుల ఉనికిని తెలుసుకోటానికి దుర్యోధనుడు కౌరవ సేనతో కలసి విరాట నగరంపైకి దండయాత్రకు వస్తాడు.అప్పటికే విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుధం లో సుశర్మతో పోరాటానికి వెళతాడు.బృహన్నల రూపం లో నిన్న అర్జునుడు ఉత్తరునితో కలసి యుధ్ధభూమికి వస్తాడు.అది చూచి ద్రోణుడు సమయ బంగ మైనదేమొనని  సందేహాన్ని వెలిబుచ్చగా భీష్ముడు కాలేదని చెబుతాడు.అలా వస్తున్న అర్జునుని చూచి ద్రోణుడు భావిస్తాడు.
                  సిమ్హము ఆకలితో గుహలో ఉండి ఒక్కసారిగా మాతంగ సమూహాన్ని చూడగానే పెల్లుబికిన కోపం తో ఉరుకుతుందో అలాగే అరణ్య అఘ్నాత వాసాల్ని పూర్తిగా చేసిన అర్జునుడు కౌరవ సేనపైకి సమరము పై ఉత్సాహం తోవచ్చు చున్నాడు. వీరుడైన అర్జునుడు ఇంతకాలం చేతులు కట్టుకొని  ఆకలితో ఉన్న సిమ్హం వలె ఉన్నాడు అని తిక్కనపోల్చాడు."వీడే"అనడం లో కూడా ఔచిత్యం కనిపిస్తుంది.ఇది తిక్కన రచనా చమత్కృతి.

Monday, October 13, 2014

మూలిగేనక్క------


            అసలే రాష్ట్రానికి నిధుల కొరత.రాజధాని నిర్మాణం కోసం భారీ అంచనాలు .ఇంకో వైపు ఎడా పెడా ప్రకటించేస్తున్న చంద్రబాబు  సంక్షేమ పధకాలు.ఇప్పటికీ తేలని ఉద్యోగుల విభజన.ఇంకా ఎన్నో సమస్యలు.వీటన్నిటితో సతమౌతుంటే  మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు  హుద్ హుద్  తుఫను  తీవ్ర కష్టాన్ని,నష్టాన్ని కలుగజేసింది.ఎవరెన్ని నిధులు ఇచ్చినా ఉడుత సాయమే అవుతుంది కాని పూర్తిగా న్యాయం జరగదు.జనజీవనం సాధారణ స్థాయికి  రావడానికి ఎన్ని రోజులు పడుతుందో?త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిద్దాము.


Sunday, October 12, 2014

రాగిపిండికారప్పూస:--


      రాగి పిండి------------------------1కప్పు
      వరి పిండి-------------------------1/2కప్పు
      శనగ పిండి--------------------2స్పూన్లు
      వాము ---------------------------2స్పూన్లు
      వెన్న----------------------------2స్పూన్లు
      నూనె---------------------------2కప్పులు
      ఉప్పు----------------------------రుచికి సరిపోను
                  వాము కచ్చా పచ్చాగా నూరుకొని  నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి.ష్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగినాక కలిపి పెట్టుకున్న పిండిని కారప్పూస గొట్టం లో పెట్టుకొని వత్తుకోవాలి.ఎర్రగా కాగినాక తీసుకోవాలి.రుచికి బాగుంటాయి.ఆరోగ్యానికి మంచిది.
     

Saturday, October 11, 2014

మేథీపూరీలు:---


         గోధుమ పిండి---------------------2 కప్పులు
         సేమియా------------------------------1/2కప్పు
         ఉప్పు ----------------------------------1స్పూన్
         వాము---------------------------------1స్పూన్
         నూనె----------------------------------5స్పూనులు
         మెంతి (ఎండిన)-----------------------3స్పూనులు,
        (పచ్చిదైనా. సన్నగా తరుగుకొని కలుపుకోవాలి)
        నూనె---------------------------------వేయించడానికి సరిపోను
                  
                       వేయించటానికి తీసుకున్న నూనె కాక మిగిలిన వాటిని గోరువెచ్చని  నీటితో ముద్దగా కలుపుకోవాలి.దానిని తడి బట్ట కప్పి ఒక గంట పక్కన ఉంచాలి.
                     చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలు గా  వత్తుకోవాలి. వాటిని నూనెలో  బ్రౌన్ రంగు వచ్చే వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి.అలా వేయించుకున్న వాటిని తిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్కువ ఉన్న నీటిని పీల్చు కుంటాయి.మేథీ పూరీలు తినడానికి రెడీ.
                               

Friday, October 10, 2014

Baapu kadha

మబ్బూ వానా మల్లె వాసనా
              బాపూ గారి గీతలే కాక రాతలు కూడా మనసుని గిలిగింతలు పెట్టేవే.అలాంటి కధే ఇది.28.8.1957 లో ఆంధ్ర వార పత్రిక లో ప్రచురితమైన బాపు కధని   బ్లాగ్మిత్రులతో కలసి మరొకసారి గుర్తు చేసుకుందామని ఇక్కడ రాస్తున్నను.
           తెర మీద మధుబాల సిగపూల సొగసు చూడగానే మాధవ రావు లో ఒక మధురానుభూతి కలిగి ,యతిప్రాసయుతమైన వాక్యంలారమణీయ రూపం ధరించి ,తీరని కోరిక అంత పెద్ద కెరటం లా లేచి ,అందం గా విరిగిపడి మనసుని కలవరపరచింది.సీత,వెన్నెల,మల్లెపూలు,అందమైన ఊహలు,మబ్బూ,వానా ఇలాటివాన్నీ గబగబా ఙాపకానికి వచ్చేశాయి.ఇంటికి బయలుదేరాడు.
          మాధవ రావు కి మల్లెపూలంటే ఇష్టం.
      "సీతా!నువ్వు జడలో మల్లెపూలు ముడుచుకుంటే  ఎంత బావుంటావనుకుంటున్నవ్!పిల్లతెమ్మెరలు ఆ మల్లెల చల్లటి పరిమళాన్ని మెల్లిగా,నా నాసాపుటాలకు విందుగా అందజేస్తుంటే ఎంత బాగుంటుందో--ఈ లోకమే మరిచిపోతా!-అదొక మధురానుభూతి." అని మాత్రమే ఎప్పుడూ అనలేదు.అతనికి అలాంటి మాటలాట్టే సహించక పోవడం ఒక కారణం.
         రెండోది -తన అర్ధాంగి సవరం వాడుతుంది.అందుకని "నీ సవరం లోని పువ్వులు"అని వాక్యం సవరించాలి.దాంతో పొయిట్రీ కాస్తా పోనేపోయే.
         'టంటింటంటింటంటం'అన్నాడు మాధవ రావు.హీరో దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ'అట్ట తోటాలో హింధీ హీరోయన్ పాడిన పాటను యధాశక్తి అనుకరిస్తూ.
          ఇంకో నిముషాలు తరువాత తెలుపు తాళం తీసి ,లోపల బల్ల మీద పడేస్తూ "టంటరటింటం టరటరటం" అని కూడా పడాడు.ప్రస్తుతం సీత ఇంట్లో లేదు కాబట్టి ఇంకో నాలుగు టరటాలు కలిపి పాడినా పరవాలేదు.
           ఆఫీసు నుంచి తిన్నగా సినిమాకి వెళ్ళి హోటలు వాడు"ఇది అన్నమే"అని హరం ఈ ఇచ్చిన పదార్ధాలను  వాడు నొచ్చుకు పోతాడేమో అని తను కూడా అది అన్నమే  అని నమ్మేసి తన ఇంటికి వచ్చాడు.
          సీత ఉదయం బయలుదేరి  పక్క ఊళ్ళో  చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళింది.రేపో ఎల్లుండో వస్తుంది.
            రాత్రి  పదిన్నరవుతోంది.
          "వెదర్  యమగా ఉంది"అనుకున్నాడు.అందువల్ల తెగించి గోల్డ్Fలెకు  పెట్టి కొనేశాడు.రూపాయి నోటు తీసుకొని మళ్ళీ లిక్కి లిక్కి మని అణా చిల్లరివ్వట మేమిటని ,అడక్కుండానే కొట్టువాడు డీలక్సు ఆగ్ని పెట్టి  చేతిలో పెట్టాడు.పిల్లలు కలవాడు -పోనీలే అని మాధవ రావు  అడ్డు చెప్పలేదు.
           సిగిరెట్టు  వెలిగించి ,లైటార్పి పక్క మీద పడ్డాడు.బయట గాలి జోరుగా వీశ్తోంది.కొద్ది నిముషాలకి చినుకులు ప్రారంభించాయి.పొడినేల మీద తొఇల్ చినుకులు పడగానే వచ్చిన వాసనకి మాధవ రావు ముగ్ధుడై పోయాడు.
               వారం రోజుల సంగతి  గుర్తొచ్చింది.
                     ********.         *****.            ****
           తెల్లారి అయిదింటికి  వాన మొదలైంది.వానంటే కూడా మాధవ రావు కి ఎంతో ఇష్టం.పెళ్ళవని రోజుల్లో ,వానొచ్చి నప్పుడల్లా, పక్కన తన కిష్టమైన చక్కటి  అమ్మాయి చెక్కిలికి చెక్కిలి ఆనించి మరీ వాసన చూడాలని ఉండేది.
          పెళ్ళైన తరువాత ఒక రోజు వాన రాగానే ఆ సంగతి గుర్తుకొచ్చింది.అపుడు సీతని లేపి చెంపకి చెంప ఆనించి వానని చూధ్ధామని అడిగితే నిద్దుర మత్తులో ఆ అమాయి కంగారు పడొచ్చు .అయినా లేపాడు.
      "ఊ" అంది సీత కళ్ళు తెరవకుండానే.
       "వాన"అన్నాడు తను
        "కిటికీ తలుపులు మూసేయండీ   జల్లుకొడుతుంది"అంది సీత.
     మాధవరావుకి  చిరాకేసింది.
      "అబ్బే అది కాదు.కిట్కీ దగ్గర  కూచొని వాన చూద్దాం రా లే"అన్నాడు కోపంగా.
        సీత ఆవులించింది "బావుల్దండీ--హాయ్-అదే బావుల్ది.అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్లు చాల్చాఉ.పడుకోళ్ది"అంది-అటు వేపు తిరిగి".
            "   టెక్నికల్ అబ్జెక్షన్ అర్ధ రాత్రి కాదు--ఇపుడు అయిదు యయ్ ఇంద్రి--తెల్లరి--"అన్నాడు ఇంకా కోపంగా.
       సీతకు ఇవేమీ వినిపించినట్లు లేదు.
     మండిపోయాడు మాధవ రావు.
  దడ దడా లేచి పళ్ళు తోమేసి ముఖం కడిగేసుకొని అంతకన్నా కసిగా పదహారు అగ్గి పుల్లల సాయంతో కుంపటి అంటించి పారేశాడు. మాళ్ళీ తెచ్చి వంటింట్లో పెట్టి వసారా లోకి వచేప్పటికి గూట్లో పాలగిన్నె ఖాళీగా కనిపించింది.ఇంకా పాలవాడు రాలేదు.వానపడ్డం మూలాన్ని వాడూ బహుశా వాడి తాలూకు అర్ధాంగి చెంపకి చెంపాంచి వానని చూస్తున్నాడేమో!వాది బొంద వాడికి రొమాన్సేమిటి,కల్చరుండదు-బహుశా ,బియ్యే,గియ్యే చదివాడా ఏడిశాడా.... మాధవరావు నిశ్శబ్దంగా చిన్న కధాకళీ నృత్యం చేసి పడక్కుర్చీలో కూచొని నిద్దరోయాడు.
      *****.    *******.         *****
          ఇపుడా సంగతి ఆలోచించుకుంటూంటే ఆరోజు ఎప్రోచ్ బాగులేదనిపించింది.
     "అసలలా కాదు. మృదువుగా మాట్లాడి ఉండాల్సింది."అనుకున్నాడు.
    బయట వాన జోరు కొంచెము తగ్గింది.కిటికీ లోంచి వచ్చే గాలి కి  దుప్పటి మడత పడింది. సిగరెట్టు బయటికి విసిరి,దుప్పటి సరిజేసి తలగడా మీద తల ఆంచాడు.
      మల్లెపూల వాసన గుప్పుమంది.
  నిన్న రాత్రి ,సీత పక్కింటి వారి అమ్మాయి తెచ్చిపెట్టినవీ,తను ముందే కొన్నవీ కలిపి జడలో రోజూ కంటే మరిన్ని పూలు తురుముకొంది.వాటి తాలూకు పరిమళం తలగడాని అంతటా అలముకొని ,జవరాలి కంచుకంలా గాఢాశ్లేషం చేసుకుందనిపించింది.మర్నాటికీ ఆ పరిమళం అలాగే ఉండటం గమనించిన మాధవ రావులో తక్షణం మనోహరమైన ప్రణయ భావాలు, మధురస్మృతులు మెదిలాయి.
    ఆమాంతం  సీత అంటె ప్రేమ పెల్లుబికింది.
    తను మొదటిమాటగా పెద్ద పండక్కి అత్తారింటికి  వెళ్ళినప్పుడు ,గుమ్మం దగ్గర మల్లెపూలు బేరం చేస్తున్న సీత అప్పుడే రిక్షా దిగిన తన్ను చూడగానే బోలెడు సిగ్గుపడిపోయి గబుక్కున లేచి ,గడప తగిలి బోర్లా పడినంత పనిచేసి వసారా తుడుస్తున్న పనిమనిషిని ఢీ కొట్టి పడిపోకుండా నిలదొక్కుకొని లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయిన సంద్బర్భం తలచుకొని తక్షణం తనూ బోలెడు సిగ్గుపడిపోయాడు. ఆ మైకం లో దమ్మిడీ కూడా ఎక్కువివ్వనని పరాగ్గా అర్ధ రూపాయి చేతులో పెట్టేశాను.
         రాత్రి డాబాలో వెన్నెల కింద పక్క వేశారు.మామగారి సంభాషణని తప్పించుకొని డాబా మీదకు వెళ్ళిన తనకు తెల్లటి వెన్నెల కింద పక్క,పాక్క మీద పాల కెరటం లాంటి మెత్తటి తెల్లటి దుప్పటి దుప్పటి మీద ఆ కెరటపు నురగలా తెల్లటి మల్లెపూలు "ఓహ్!ఏమి టేష్టురా"అని గుండెలు బాదుకున్నాడు."Yఅమ టేష్టు"అని జవాబు చెప్పుకున్నాడు.
         ఈ మధుర స్మృతులన్నీ సీతకు గుర్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.మర్నాడు ఆఫీసు నుంచి వచ్చే టప్ప్తికి సీత వచ్చేసింది. కాఫీ తాగుతూ విషయం చెబుదామనుకున్నాడు. చాకలి వాడికి బట్టలు వేస్తోంది ఇది మంచి సమయం కాదు భోజనాలయ్యాక వెన్నెలలో భేషుగ్గా ఉంటుంది అనుకున్నాడు.
        సీత వంటిల్లు తాళం వేసి వచ్చి  తమలపాకులు చిలకలు చుట్టి నోట్లో వేసుకుంటోంది.చెప్పాలని నోరు తెరిచే టప్పటికి ఆటేపెళ్లింది.
  కాసేపు తెల్లబోయి తమాయించుకొని"సీతా ఇటురా"అన్నడు
    చెప్పాలనుకున్నది వాయిదావేసి "పెళ్ళి బాగా జరిగిందా"అన్నాడు.
       "ఆ పెళ్ళికేం బాగా జరిగింది.మీరు రాలేదని ఇదయ్యారు."అన్నది.
     అర్ధం చేసుకో లేదమని విసుక్కుంటూ ఫ్లష్ బాక్తో ప్రారంభించాలని"నేను పెద్ద పండక్కి మీ ఇంటికొచ్చినప్పుడు గుర్తుందా?"అన్నాడు.
          "లేకేం. అప్పుడు మా అమ్మ నాకు పెట్టిన చీర గుర్తుందా? ఎర్రంచు  బార్డరు తెల్ల చుక్కలు.అలాంటిదే మగపెళ్ళివారు పెట్టారండీ నిన్న ఎళ్ళిలో................."
    "మంచి నీళ్ళు!మంచినీళ్ళు!"అన్నాడు మాధవ రావు.
    తెచ్చిచి పక్క మీద వాలింది సీత "నిన్నంతా నిద్ర లేదంటూ"
    ఆఖరి ప్రయత్నంగా "సీతా!నిన్న రాత్రి తలగడ మీద మీద వాలగానే వాసన.."
 "అబ్బే మాసిపోయాయండీ  ఇవాళే చాకలాడికి వేసేశా కొత్తవి తొడిగాలెల్ది. -హాయ్--పడుకోండి. బాబూ నిదరొస్తోల్ది "అంది సీత ఆవులిస్తూ.
"లైటార్పేయండి బాబూ కాస్త "అని కూడా అనింది.
 ఎర్రంచు బార్డరు....హు!అని సణుక్కుంటూ స్విచ్చి దగ్గర కెళ్ళాడు మాధవ రావు.
                                      బాపు.


           

Wednesday, October 8, 2014

వ్యాసుడు


           కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
           ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
        ఈ రోజు  ఆదికవి వాల్మీకి జన్మదినం.శ్రీమద్రామాయణ రూప కర్త.ఇతడి పూర్వ నామం రత్నాకరుడు.వ్యాధుడు వేటాడుతూ జీవనం సాగించేవాడు. ఋషుల సూచనతో "మరా,మరా" అనే నామ ఝపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయాడు.చుట్టూ పుట్టలు(వల్మీకం) పెరిగి పోయాయి.బాహ్య ప్రపంచాన్ని వదిలేసాడు.ఈ సమయం లోనే నారదుడు రామకధను వినిపించాడు.ఒకరోజు శిష్యులతో వెళుతుండగా ఒక బోయవాడు క్రౌంచ పక్షుల జంట లోని మగపక్షిని చంపగా  ఆ దూఃఖం తో ఆడ పక్షి కూడా చనిపోతుంది.ఆ దృశ్యం చూసి చలించి శోకం నుంచే  శ్లోకం పుట్టింది.అదే--
    మానిషాద ప్రతిష్ఠాం త్వగమః శాశ్వతీస్సమా అః
    Yఅత్ క్రౌంచ మిధునాదేక మవధీఅః కామమోహితం||
           శోకం తో ఉన్న వాల్మీకి తో బ్రహ్మ నీవు చెప్పినది చంధో బధ్ధమైన శ్లోకము.రామాయణ కావ్యాన్ని రచించమని సూచించాడు.
           అలా ఆదికావ్యం రామాయణం ఆవిర్భవించింది.ప్రభు ధర్మాన్ని,ఆదర్స గార్హస్థ్య జీవితాన్ని వాల్మీకి భవ్యం గా చిత్రించ దలుచుకున్నాడు.సమాజాన్ని నీతి,ధర్మం,శీలం,సదాచరణ మొదలైన వాటిని బోధించాలనే తపనే ఈ కావ్యం. ఇది మానవాళికి లభించిన అపూర్వ కావ్యము.ధర్మ సంశయములను దూరమొనర్చి,పవిత్రధర్మములను సూచించును.వేదముల,ఉపనిషత్తుల సారమును సామాన్యులకు అందజేయు అద్భుత కర్తింగ్.
     "భక్త్యా,శక్త్యా చ యుక్త్యా చ బ్రూయాద్రామాయణం నరః"
         భక్తితో,పాండిత్యపు శక్తితో,వాద ప్రతివాద యుక్తి తో రామాయణాన్ని చదవాలి.ఈ కావ్యాన్ని చదవడం వలన మోక్ష ప్రాప్తి లభిస్తుందని  చెప్పబడింది.సీతా వివాహ గట్ట పారాయణం,సుందర కాండ పారాయణం వంటి వాటి వలన ఇహలోక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడింది.అలాగే  రామలక్ష్మణులు,భరత శత్రుఘ్నులు,రావణ విభీషుణులు  ద్వారా--భ్రాతృ ధర్మం,కౌసల్య,సుమిత్ర,కైకల ద్వారా---భార్య,మాతృ ధర్మాలను;దశరధుని ద్వారా--భర్త,పితృ ధర్మాలను;జటాయువు,సంపాతుల ద్వారా---స్నేహ ధర్మాన్ని;ఆంజనేయుడు ద్వారా--నిస్వార్ధ సేవా ధర్మాన్ని ప్రభోధిస్తారు.సీత లోకమున స్త్రీఇలు అనుసరించదగు అనేక ధర్మములను ఆచరించి చూపినది.
                 ఈంతటి మహోత్కృష్ట వారసత్వ సంపదను మనకు అందించిన వాల్మీకికి సదా మనం కృతఙులమై ఉండాలి.





Monday, October 6, 2014

Vihanga viikshanam

ఆకాశ వీక్షణంలో భూమిని చూస్తే ఇలాంటి  ఆద్భుత దృశ్యాలు ఆవిష్కారమౌతాయి.











Sunday, October 5, 2014

    రామప్ప  గుడి
       అన్ని శివాలయాలలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం.కాని  ఇక్కడ నంది ప్రత్యేకం.తల కుడి వైపుకి తిప్పి రెండు చెవులు నిక్కపొడుచుకొని ఒక కాలు లేపి శివుని ఆజ్ఞ్ కోసం ఎప్పుడు పిలిచినా లేవటానికి రెడీగా ఉన్నట్లు ఉంటుంది.ఒకసారి మీరూచూడండి.

Friday, September 26, 2014

మంచిమాట

అర్ధము అనర్ధ కారణ మని శౌనకుడు ధర్మరాజుకి చెప్పిన ఈ పద్యము నేటి కాలానికి కూడా వర్తించును. 
క. అర్ధమ యనర్ధ మూలమ్ ,
    బర్ధమ మాయా విమోహ నా వహము నరుం 
    డర్ధార్జన  దుఃఖ మున ,
    న, పార్ధి కృత జన్ముడగు ట  పర మార్ద మిలన్ !


వన్ కాయ కూర.
     వంకాయలు------------------1/4 కెజి
    పచ్చి మిర్చి--------------4
    అల్లం ------------------------చిన్న ముక్క
    వెల్లుల్లి రెబ్బలు-------------5
    జీరా-------------------------1/2స్పూన్
    ఉప్పు------------------------సరిపడా
    కరివేపాకు---------------రెండు రెబ్బలు
    నూనె-----------------------రెండు స్పూనులు
    పోపు దినుసులు--------ఆ వాల్లు,మినపపప్పు, శనగ పప్పు
                        ముందుగా  జీర,పచ్చి మిర్చి,అల్లం,వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి.తరువాత వంకాయలు సన్నగా తరుగుకొని నీళ్ళలో వేసుకోవాలి.స్టౌ మీద బాణిలి పెట్టి  నూనె వేయాలి.కాగినాక పోపు దినుసులు అవి ఎర్రబడినాక కరివేపాకు అందులోనే నూరిపెట్టుకున్న పచ్చి మిర్చి ముధ్ధ ఉప్పు వేసి కమ్మటి వాసన వచే వరకు వేయించి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్క లని  వేసి సన్న సెగని వేయించాలి.ఇది చాలా రుచిగా ఉంటుంది.

Thursday, September 25, 2014

saratrutuvu



సప్త ఋషి మండలం బు తో
గగనం దేదీప్యమానమై నొప్పె
సుదాం శు ని కిరణములు  సోకి
దఌతకమలములు దర హాసము తో వెలిగె
వికసిత  నవ కమల సౌరభము తో
జగతి సుగంధ వికీర్ణ మానమయ్యె
భూ వనిత నవ తృణ శిలీన్ధ్రములతో
చిత్ర విచిత్రాం బరములు ధరించి
హరివిల్లు భువికి హారమైన దన్న భ్రాంతి  నొసగె
ఆకాశం తారాహార పంక్తుల తో
దీపతోరణ ములవో లే వెలుగొందే
శ రాతాగామము అఖిల జనులకు
మోదమును గూర్చె.


Wednesday, September 24, 2014

పొట్లకాయపచ్చడి


పొట్లకాయ ----------------------1చిన్నది
పచ్చి మిరపకాయలు ----------4
ఉల్లిపాయ ----------------------1
పెరుగు-----------------------
నూనె---------------------------రెండు స్పూన్లు
చింతపండు -------------------ఒకరెబ్బ
కరివేపాకు --------------------రెండు రెబ్బలు
పోపుదినుసులు --------------ఆవాలు,జీరా,మినపపప్పు,శనగపప్పు,కలిపిరెండు స్పూన్లు
ఇష్టమైన వారు ఇంగువ చిటికెడు. ఉప్పు సరిపడా
    ముందు పొట్ల కాయ ముక్కలు కోసుకొని నీళ్ళలో వేసి ముక్క కొంచెం మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. అది పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. బాణిలిలో ఒక స్పూను నూనె వేసి పచ్చి మిరపకాయలు వేయించాలి. ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరుగుకోవాలి. వేయించిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు,చింతపండు జీలకర్ర మిక్సీలొ వేసి ఒకతిప్పు తిప్పిన తరువాత ఉడికిన పొట్లకాయ ముక్కలు నీరు పిండి ఆమిశ్రమమ్ లోవేసి మరీ మెత్తగా కాకుండాఆతిప్పి తీసివేయాలి. ఇప్పుడు మరల స్టౌ మీద బాణిలి పెట్టి ఒకస్పూను నూనె వేసి కాగినాక పోపు దినుసులు కాలాక ఇంగువ ,కరివేపాకు తరిగిపెట్టుకొన్న ఉల్లి ముక్కలు వేసి రెండు సార్లు తిప్పి  మిక్సీ వేసిన మిశ్రమాన్ని అన్దులోవెయ్యలి.ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించ కూడదు. మొత్తం బాగా కలిపి స్టౌ కట్టేసి పెరుగు వేసి బాగా కలుపుకొని  గిన్నెలోకి తీసుకోవాలి. పొట్లకాయ పచ్చడి రెడీ. 

Monday, September 22, 2014

మంచిమాట

 
    ఆత్మ విశ్వాసం ,ఆత్మజ్ఞా నము,ఆత్మ నిగ్రహం -ఈ మూడూ గుణాలు మనిషి జీవితాన్ని ఏంతో శక్తివంతం గా తయారు చేస్తాయి. 

పంజాబీరోటీ


       మొక్క జొన్న పిండి-------2 కప్పు లు
      గోధుమ పిండి-----------1/2 కప్పు
     సాల్ట్     ---------------------1 tsp స్పూన్
      బంగాళా దుంపలు-----4
      కొత్తిమీర---------------------కొంచెము
      కారం-----------------------1tsp స్పూన్
     నూనె---------------------------వేయించడానికి సరిపడా
          ముందుగా బంగాళా దుంపల్ని  ఉడికించుకొని  మెత్తగా చేసుకోవాలి.అందులో నూన్ తప్ప మిగిలిన సరుకులు అన్నీ వేసుకొని గోరు వెచ్చని నీటితో కలుపుకోవాలి.ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని రోటీ కర్రతో గుండ్రం గా అతుక్కోకుండా పిండి జల్లుకుంటూ వత్తుకొవాలి.అన్నీ చేసిన తరువాత స్టౌ మీద బాణిలి పెట్టి సరిపడా నూనె పోసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి.అంతే పంజాబీ రోటీ తింటానికి రెడీ.

Saturday, September 20, 2014

శ్రమయేవ జయతే


             శ్రమ అంటే కష్ట పడటం,పనిచేయడం. ఎవరి కి చేతనైన పని వారు చేయాలి.తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు ఎంతున్నా కూర్చుని తింటూంటే కొండలైనా కరిగిపోతాయి.కొంతమంది  కొన్ని పనులు బాగా చేయగలుగుతారు.ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటుందో  అందులో ప్రావీణ్యత సంపాదించ వచ్చు. ఒకవేళ ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా  మొక్కుబడిగా కాకుండా  ఇష్టం చేసుకోవాలి అప్పుడు కష్టమనిపించదు.
" తన కిష్టమైన కార్యాన్ని పరమ మూర్ఖుడు సైతం సాధిస్తాడు.కానీప్రతి కార్యాన్ని తన అభీష్టానికి అనుగుణంగా మలచుకో గలవాడే బుధిశాలి,ధీశాలి"---అంటారు స్వమి వివేకానంద.
        కొంతమంది కొంచెం పని చేయగానే ఎంతో కష్ట పడిపోయినట్లుగా ,తాను మాత్రమే చేసినట్లుగా భావిస్తారు.అలాంటి వారికి కనీస అవసరాలకు లోటు లేకపోవచ్చు కానీ ఉన్నత శిఖరాలు ఎక్కలేరు.శ్రమ లోనే విశ్రాంతి వెతుక్కునే వారు ఆర్ధికం గానే కాక సమాజం లో కూడా ఒక గుర్తింపుని పొందగలరు.తక్కువ శ్రమ ఎక్కువ విశ్రాంతి కోరేవారు ఏమీ పొందలేరు.పైగ కబుర్లతో కాలక్షేపం చేస్తూ అనవసర వ్యాసంగాలతో అశాంతిగా ఉంటారు. బధ్ధకం,అలసత్వం,అలక్ష్యము మనిషి కి  బధ్ధకం శత్రువులు.కృషి ,పట్టుదల మనిషి కి కనిపించని రెండు రెక్కలు.ఇవి రెండూ ఉంటే దేన్నైనా సాధించ వచ్చు.
          నేటి  తరం  కలలు కంతున్నారు కాని అందుకు తగిన శ్రమ చేయక పోవడం,ఒక్కసారిగా ఎవరెష్టు శిఖరాలు ఎక్కాలనుకోవడం,అది సాధ్యం కాక మధ్యలోనే వదిలేయడం.నిరాశా,నిస్పృహలకు లోనవడం.ఏ పనైనా మొదలు పెట్టినప్ప్డు పూర్తిగా అవగాహన చేసుకోవాలి టుదొర్ వరకు నిబధ్ధతో చేయాలి.
   భర్తృహరి అంటారు:--
"నీచులు  విఘ్నాలు కలుగుతాయని ముందే పని మొదలుపెట్టరు,మధ్యములు మొదలుపెట్టి  విఘ్నాలు కలగగానే మధ్యలో వదిలేస్తారు, ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకుంటూ అనుకొన్నది సాధిస్తారు."

    ఇంక"కార్యసాధకుడు దూఃఖాన్ని,సుఖాన్ని లెక్కించడు."--అలా చేయగలిగి నప్పుడే జీవితం లో స్థిరత్వాన్ని పొందగలుగుతాము."కృషి తో నాస్తి దుర్భిక్షం"-
సమయాన్ని వృధా చేయకుండా దేన్నైనా "శోధించి సాధించడమే ధీర గుణం".అప్పుడే విజయం నీ సొంతమౌతుంది.


Thursday, September 18, 2014


అమ్మ


          కడుపులో 
          బీజం పడగానే
          స్త్రీత్వానికి  ప్రతీకననే
          ఆనందానుభూతిలో  నేను

         సుతిమెత్తని
         కదలికలతో కలియతిరుగుతుంటే
         కలల ఊహలలో
         ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ నేను

         తప్పటడుగుల్తో
         తడబడుతుంటే
         ఎక్కడ గాయపడతావోనన్న
         భయాందొళనలో నేను

        ఆ తడబాటు 
       ఆలవాటు గా మారితే
       విచలిత మనస్కనై
       విషణ్ణ వదనంతో నేను.

       నేరస్థుడిగా
       లోకం నిన్ను దోషిగా చూపితే
       ముక్కలైన హృదయం తో
       బ్రతుకంతా జీవచ్చవం లా నేను.


Tuesday, September 9, 2014

మంచిమాట


          "ప్రతిభ"అంటే  బుధ్ధి లో కొత్త  విత్తనం మొలకెత్తటమే! 
        1.నవ్య కల్పన. 2.నవ్యోత్సాహము.3. నవీన అన్వేష్ణ 4.జీవనమునకు నవీన దిశ
            -----వినోబా.

ChaaTuvu.

చాటువు
         వేముల వాడ భీమకవి మహిమానిత్వాన్ని గూర్చి చెప్పబడిన ఈ చాటువు ఎవరి కృత మైనప్పటికీ విశిష్టమైనది గా చెప్పవచ్చు.
   చం. మతి,ప్రభ,నీగి,పేర్మి,శిరి,మానము పెంపున భీమునిన్ బృహ
              స్పతి,రవి,కర్ణు,అర్జును,కపర్ధి,సుయోధను బోల్ప బూన;నా
              మతకరి,తైష్ణు,దుష్కులు,నమానుషు,భిక్షు,ఖలాత్ము నెంచ;వా
             క్సతిపు,శశిన్,శిబిన్,కొమరు సామిని,మేరువు,నబ్ది బోల్చెదన్.
                              బుధ్ధి విషయం లో భీమకవి బృహస్పతితో కాక వాక్సతి భర్త బ్రహ్మ తో పోల్చ దగినవాడట.బృహస్పతి మతకరి కనుక.తేజస్సు లో రవి తీక్షణుడు కనుక చంద్రుని తో పోల్చదగిన వాడు.దాత్రుత్వం లో కర్ణుడు దుష్కలుడు కనుక శిబి తోను,పౌరషం లో అర్జునుడు పేడి వాడు కనుక కుమారస్వామి తోను,ఐశ్వర్యం లో శివుడు భిక్షువు కనుక  మేరువు తోను,అభిమానం లో సుయోధనుడు ఖలాత్ముడు కనుక  సముద్రం తోను పోల్చాడు. క్రమాలంకారం లో ఎంతో చక్కగా చెప్పబడిన  చాటువు.

Sunday, September 7, 2014

Jత్యాగం



            విత్తనం తాను
                 చనిపోతూ
            పంట  నిచ్చింది.
           పువ్వు  తాను
                   రాలిపోతూ
          పండు నిచ్చింది.
          సూర్యుడు తాను
                   అస్తమిస్తూ
         వెన్నెల నిచ్చాడు.
        భూమి  తాను 
                  తిరుగుతూ
         అనంత కాలాన్నిచ్చింది.
         ప్రకృతి  తాను
                  తరిగిపోతూ
        సమస్త  సంపదల నిచ్చింది.
        అమ్మ తాను
                   కరిగిపోతూ
        జీవితాన్ని ఇచ్చింది.
        ఇన్ని త్యాగాలతో
        జీవిస్తున్న మనం
        సమాజానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?

Saturday, September 6, 2014

Maa inti tota










Vidyaa daanam

    అన్న దానము గొప్పదనవచ్చునే కాని
                       అన్నంబు  జాములో నఋఇగిపోవు
    వస్త్రదానము గూడా భవ్య దానమె కాని
                       వస్త్ర మేడాదిలో పాతదగును
    గృహదానమొకటి  యుత్క్ర్ష్ట దానమె కాని
                       కొంప కొన్నేండ్ల లో కూలిపోవు
   భుమి దానము మహాపుణ్య దానమె కాని
                       భూమి యన్యులజేరిపోవవచ్చు
   అరిగిపోక ,ఇంచుకయేని చిరిగి పోక,
   కూలిపోవక యన్యులపాలు గాక
    నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి
    యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.
                        ----చిలకమర్తి లక్ష్మీ నరసిమ్హం.

Friday, September 5, 2014

Telugu bhaasha

తెలుగు భాష
     "ఖ"కి కాలం చెల్లిందని
      "క" తో సర్దుకు పోదామా!
       ఖాళీని  క  తో పూరించ గలమా!
      "ఘ" గడప దాటిందని
       "గ "తో గడుపుకుందామా?
       "ఘడియ"తో "గడియ"వేయలేము కదా!
        "ఛ"ని వదిలి చదివేధ్ధామా?
          "ఛత్రము" లేని చాయ గా ఇగిలి పోదామా!
         "ఝ" ని చూసి  జడుసుకొని
          జరిగిపోదామా?
         తుమ్మెదల "ఝ"ంకారాన్ని,
        "ఝ"రుల గగలల్ని 
         వినడం మానివేద్దామా?
        "ఠీ"వి గా ఉన్న "ఠ"ని
        మరచిపోయి
        ఖన్"ఠా"న్ని కంటకముగా మార్చేద్దామా?
       "ఢ"మురక నాదాన్ని
        "ఢ"ంకా భజాయించి చెప్పలేక
        డబ్బాలో పెట్టే ద్దామా?
        "థ"తరలిపోయిందని
         త నే తలచుకుందామా!
         క"థ" మారిపోయి కతే మిగులుతుంది.
         "భ" ని చూసి భయపడి
         "భ"రతుడి ని బరతుని గాచేసి
          "భ"ంగ పడదామా?
         అ"ణా",కా"ణీ"లు అలుసై పోయాయని
         గ"ణ"పతి తో బూ"ణీ" చేయని
         పూజ ఉండదు కదా?
       శాంతం గా జీవించా లని
      సాంతం గా భాష నే మార్చి
      మనని మనం ఏమార్చుకొని
       తెలుగు కే తెగులు పట్టిద్దామా?