Sunday, October 2, 2011

వార్త

ఇరవైనాలుగు గంటల న్యూస్ చానల్స్ వచ్చినాక వార్తలకు కొదువ లేదు.అప్రస్తుతమైనది ,అనవసరమైనవిషయాలు ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి.ఈ రోజు ఆంధ్ర జ్యొతి చానల్ లో చూపిన వార్త మన ముఖ్యమంత్రి
గారు గాంధి సమాధికి నివాళులు అర్పించటానికి వెళ్ళి తూలిపడబోయారట అది వార్త అదే విషయాన్ని రివైండ్ చేసి పదేపదే ఆ క్లిప్పింగ్ చూపవలసిన అవసరము ఉన్నదా?అది అంత ముఖ్యమైన విషయమా?హైలెట్ చేసి చెప్ప టానికి.వ్యక్తుల జీవితాలలోకి తొంగి చూడటం అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటైపోయింది. అది ఎదుటివారికి ఎంత ఇబ్బందిని కలుగ చేస్తుందో అన్న ఆలోచన ఎంతమాత్రం ఉన్నట్లు కనిపించదు.కనీస విలువలను సంస్కారాన్ని కూడా పాటించటం లేదు .అన్ని చానల్సు ఇంచు మించు అలాగే ఉన్నాయి.

No comments:

Post a Comment