Friday, October 10, 2014

Baapu kadha

మబ్బూ వానా మల్లె వాసనా
              బాపూ గారి గీతలే కాక రాతలు కూడా మనసుని గిలిగింతలు పెట్టేవే.అలాంటి కధే ఇది.28.8.1957 లో ఆంధ్ర వార పత్రిక లో ప్రచురితమైన బాపు కధని   బ్లాగ్మిత్రులతో కలసి మరొకసారి గుర్తు చేసుకుందామని ఇక్కడ రాస్తున్నను.
           తెర మీద మధుబాల సిగపూల సొగసు చూడగానే మాధవ రావు లో ఒక మధురానుభూతి కలిగి ,యతిప్రాసయుతమైన వాక్యంలారమణీయ రూపం ధరించి ,తీరని కోరిక అంత పెద్ద కెరటం లా లేచి ,అందం గా విరిగిపడి మనసుని కలవరపరచింది.సీత,వెన్నెల,మల్లెపూలు,అందమైన ఊహలు,మబ్బూ,వానా ఇలాటివాన్నీ గబగబా ఙాపకానికి వచ్చేశాయి.ఇంటికి బయలుదేరాడు.
          మాధవ రావు కి మల్లెపూలంటే ఇష్టం.
      "సీతా!నువ్వు జడలో మల్లెపూలు ముడుచుకుంటే  ఎంత బావుంటావనుకుంటున్నవ్!పిల్లతెమ్మెరలు ఆ మల్లెల చల్లటి పరిమళాన్ని మెల్లిగా,నా నాసాపుటాలకు విందుగా అందజేస్తుంటే ఎంత బాగుంటుందో--ఈ లోకమే మరిచిపోతా!-అదొక మధురానుభూతి." అని మాత్రమే ఎప్పుడూ అనలేదు.అతనికి అలాంటి మాటలాట్టే సహించక పోవడం ఒక కారణం.
         రెండోది -తన అర్ధాంగి సవరం వాడుతుంది.అందుకని "నీ సవరం లోని పువ్వులు"అని వాక్యం సవరించాలి.దాంతో పొయిట్రీ కాస్తా పోనేపోయే.
         'టంటింటంటింటంటం'అన్నాడు మాధవ రావు.హీరో దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ'అట్ట తోటాలో హింధీ హీరోయన్ పాడిన పాటను యధాశక్తి అనుకరిస్తూ.
          ఇంకో నిముషాలు తరువాత తెలుపు తాళం తీసి ,లోపల బల్ల మీద పడేస్తూ "టంటరటింటం టరటరటం" అని కూడా పడాడు.ప్రస్తుతం సీత ఇంట్లో లేదు కాబట్టి ఇంకో నాలుగు టరటాలు కలిపి పాడినా పరవాలేదు.
           ఆఫీసు నుంచి తిన్నగా సినిమాకి వెళ్ళి హోటలు వాడు"ఇది అన్నమే"అని హరం ఈ ఇచ్చిన పదార్ధాలను  వాడు నొచ్చుకు పోతాడేమో అని తను కూడా అది అన్నమే  అని నమ్మేసి తన ఇంటికి వచ్చాడు.
          సీత ఉదయం బయలుదేరి  పక్క ఊళ్ళో  చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళింది.రేపో ఎల్లుండో వస్తుంది.
            రాత్రి  పదిన్నరవుతోంది.
          "వెదర్  యమగా ఉంది"అనుకున్నాడు.అందువల్ల తెగించి గోల్డ్Fలెకు  పెట్టి కొనేశాడు.రూపాయి నోటు తీసుకొని మళ్ళీ లిక్కి లిక్కి మని అణా చిల్లరివ్వట మేమిటని ,అడక్కుండానే కొట్టువాడు డీలక్సు ఆగ్ని పెట్టి  చేతిలో పెట్టాడు.పిల్లలు కలవాడు -పోనీలే అని మాధవ రావు  అడ్డు చెప్పలేదు.
           సిగిరెట్టు  వెలిగించి ,లైటార్పి పక్క మీద పడ్డాడు.బయట గాలి జోరుగా వీశ్తోంది.కొద్ది నిముషాలకి చినుకులు ప్రారంభించాయి.పొడినేల మీద తొఇల్ చినుకులు పడగానే వచ్చిన వాసనకి మాధవ రావు ముగ్ధుడై పోయాడు.
               వారం రోజుల సంగతి  గుర్తొచ్చింది.
                     ********.         *****.            ****
           తెల్లారి అయిదింటికి  వాన మొదలైంది.వానంటే కూడా మాధవ రావు కి ఎంతో ఇష్టం.పెళ్ళవని రోజుల్లో ,వానొచ్చి నప్పుడల్లా, పక్కన తన కిష్టమైన చక్కటి  అమ్మాయి చెక్కిలికి చెక్కిలి ఆనించి మరీ వాసన చూడాలని ఉండేది.
          పెళ్ళైన తరువాత ఒక రోజు వాన రాగానే ఆ సంగతి గుర్తుకొచ్చింది.అపుడు సీతని లేపి చెంపకి చెంప ఆనించి వానని చూధ్ధామని అడిగితే నిద్దుర మత్తులో ఆ అమాయి కంగారు పడొచ్చు .అయినా లేపాడు.
      "ఊ" అంది సీత కళ్ళు తెరవకుండానే.
       "వాన"అన్నాడు తను
        "కిటికీ తలుపులు మూసేయండీ   జల్లుకొడుతుంది"అంది సీత.
     మాధవరావుకి  చిరాకేసింది.
      "అబ్బే అది కాదు.కిట్కీ దగ్గర  కూచొని వాన చూద్దాం రా లే"అన్నాడు కోపంగా.
        సీత ఆవులించింది "బావుల్దండీ--హాయ్-అదే బావుల్ది.అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్లు చాల్చాఉ.పడుకోళ్ది"అంది-అటు వేపు తిరిగి".
            "   టెక్నికల్ అబ్జెక్షన్ అర్ధ రాత్రి కాదు--ఇపుడు అయిదు యయ్ ఇంద్రి--తెల్లరి--"అన్నాడు ఇంకా కోపంగా.
       సీతకు ఇవేమీ వినిపించినట్లు లేదు.
     మండిపోయాడు మాధవ రావు.
  దడ దడా లేచి పళ్ళు తోమేసి ముఖం కడిగేసుకొని అంతకన్నా కసిగా పదహారు అగ్గి పుల్లల సాయంతో కుంపటి అంటించి పారేశాడు. మాళ్ళీ తెచ్చి వంటింట్లో పెట్టి వసారా లోకి వచేప్పటికి గూట్లో పాలగిన్నె ఖాళీగా కనిపించింది.ఇంకా పాలవాడు రాలేదు.వానపడ్డం మూలాన్ని వాడూ బహుశా వాడి తాలూకు అర్ధాంగి చెంపకి చెంపాంచి వానని చూస్తున్నాడేమో!వాది బొంద వాడికి రొమాన్సేమిటి,కల్చరుండదు-బహుశా ,బియ్యే,గియ్యే చదివాడా ఏడిశాడా.... మాధవరావు నిశ్శబ్దంగా చిన్న కధాకళీ నృత్యం చేసి పడక్కుర్చీలో కూచొని నిద్దరోయాడు.
      *****.    *******.         *****
          ఇపుడా సంగతి ఆలోచించుకుంటూంటే ఆరోజు ఎప్రోచ్ బాగులేదనిపించింది.
     "అసలలా కాదు. మృదువుగా మాట్లాడి ఉండాల్సింది."అనుకున్నాడు.
    బయట వాన జోరు కొంచెము తగ్గింది.కిటికీ లోంచి వచ్చే గాలి కి  దుప్పటి మడత పడింది. సిగరెట్టు బయటికి విసిరి,దుప్పటి సరిజేసి తలగడా మీద తల ఆంచాడు.
      మల్లెపూల వాసన గుప్పుమంది.
  నిన్న రాత్రి ,సీత పక్కింటి వారి అమ్మాయి తెచ్చిపెట్టినవీ,తను ముందే కొన్నవీ కలిపి జడలో రోజూ కంటే మరిన్ని పూలు తురుముకొంది.వాటి తాలూకు పరిమళం తలగడాని అంతటా అలముకొని ,జవరాలి కంచుకంలా గాఢాశ్లేషం చేసుకుందనిపించింది.మర్నాటికీ ఆ పరిమళం అలాగే ఉండటం గమనించిన మాధవ రావులో తక్షణం మనోహరమైన ప్రణయ భావాలు, మధురస్మృతులు మెదిలాయి.
    ఆమాంతం  సీత అంటె ప్రేమ పెల్లుబికింది.
    తను మొదటిమాటగా పెద్ద పండక్కి అత్తారింటికి  వెళ్ళినప్పుడు ,గుమ్మం దగ్గర మల్లెపూలు బేరం చేస్తున్న సీత అప్పుడే రిక్షా దిగిన తన్ను చూడగానే బోలెడు సిగ్గుపడిపోయి గబుక్కున లేచి ,గడప తగిలి బోర్లా పడినంత పనిచేసి వసారా తుడుస్తున్న పనిమనిషిని ఢీ కొట్టి పడిపోకుండా నిలదొక్కుకొని లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయిన సంద్బర్భం తలచుకొని తక్షణం తనూ బోలెడు సిగ్గుపడిపోయాడు. ఆ మైకం లో దమ్మిడీ కూడా ఎక్కువివ్వనని పరాగ్గా అర్ధ రూపాయి చేతులో పెట్టేశాను.
         రాత్రి డాబాలో వెన్నెల కింద పక్క వేశారు.మామగారి సంభాషణని తప్పించుకొని డాబా మీదకు వెళ్ళిన తనకు తెల్లటి వెన్నెల కింద పక్క,పాక్క మీద పాల కెరటం లాంటి మెత్తటి తెల్లటి దుప్పటి దుప్పటి మీద ఆ కెరటపు నురగలా తెల్లటి మల్లెపూలు "ఓహ్!ఏమి టేష్టురా"అని గుండెలు బాదుకున్నాడు."Yఅమ టేష్టు"అని జవాబు చెప్పుకున్నాడు.
         ఈ మధుర స్మృతులన్నీ సీతకు గుర్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.మర్నాడు ఆఫీసు నుంచి వచ్చే టప్ప్తికి సీత వచ్చేసింది. కాఫీ తాగుతూ విషయం చెబుదామనుకున్నాడు. చాకలి వాడికి బట్టలు వేస్తోంది ఇది మంచి సమయం కాదు భోజనాలయ్యాక వెన్నెలలో భేషుగ్గా ఉంటుంది అనుకున్నాడు.
        సీత వంటిల్లు తాళం వేసి వచ్చి  తమలపాకులు చిలకలు చుట్టి నోట్లో వేసుకుంటోంది.చెప్పాలని నోరు తెరిచే టప్పటికి ఆటేపెళ్లింది.
  కాసేపు తెల్లబోయి తమాయించుకొని"సీతా ఇటురా"అన్నడు
    చెప్పాలనుకున్నది వాయిదావేసి "పెళ్ళి బాగా జరిగిందా"అన్నాడు.
       "ఆ పెళ్ళికేం బాగా జరిగింది.మీరు రాలేదని ఇదయ్యారు."అన్నది.
     అర్ధం చేసుకో లేదమని విసుక్కుంటూ ఫ్లష్ బాక్తో ప్రారంభించాలని"నేను పెద్ద పండక్కి మీ ఇంటికొచ్చినప్పుడు గుర్తుందా?"అన్నాడు.
          "లేకేం. అప్పుడు మా అమ్మ నాకు పెట్టిన చీర గుర్తుందా? ఎర్రంచు  బార్డరు తెల్ల చుక్కలు.అలాంటిదే మగపెళ్ళివారు పెట్టారండీ నిన్న ఎళ్ళిలో................."
    "మంచి నీళ్ళు!మంచినీళ్ళు!"అన్నాడు మాధవ రావు.
    తెచ్చిచి పక్క మీద వాలింది సీత "నిన్నంతా నిద్ర లేదంటూ"
    ఆఖరి ప్రయత్నంగా "సీతా!నిన్న రాత్రి తలగడ మీద మీద వాలగానే వాసన.."
 "అబ్బే మాసిపోయాయండీ  ఇవాళే చాకలాడికి వేసేశా కొత్తవి తొడిగాలెల్ది. -హాయ్--పడుకోండి. బాబూ నిదరొస్తోల్ది "అంది సీత ఆవులిస్తూ.
"లైటార్పేయండి బాబూ కాస్త "అని కూడా అనింది.
 ఎర్రంచు బార్డరు....హు!అని సణుక్కుంటూ స్విచ్చి దగ్గర కెళ్ళాడు మాధవ రావు.
                                      బాపు.


           

No comments:

Post a Comment