Sunday, June 28, 2015

జానపదజానపద గేయం

జానపద గేయం

     ఎంతో సౌఖ్యము గల ఈ రాజయోగము ఏమని వర్ణింతునే  రామయ్య
     పంతముతో గుణవంతుల విని యానంత సుఖం బైతినే        "
     కన్నూల లోపల ఘనమైన చిత్కాళ లున్న జాడ గంటినే  "
     వెన్నెల మీదట వేదళకంజము వెలుగు దీప్తిని గంటినే         "


     పారావారము లేక పరిపూర్ణమై వెలుగు బ్రహ్మానందంబైతినే  "
    ఆరీటి మీరి ఆరీటి మీదట ఆత్మ నేనై యుంటినే.                                      "

    అంగము మీదట గంగ యమునల సందు లింగ మర్మము గంటినే.    "
   సదమలమై వెలుగు సచ్చిదానందము సాజయోగంబైతినే.          "
 
   కరుణతో గురుడు  నా శిరమందు కరమిడి ఎరుక ఏర్పడ జేసెనే.    "
   వేదాంతార్ధములోనె బోధ తెలిపెడి దండి సాధు సంగతి గంటినే "

   హరెరామ నేను మీ స్మరణ జేసుట వలన పరమభక్తుడనైతినే. "
   వర వైరాగ్యము చాత స్థిరబుధ్ధి సాక్షినై పరమ ధన్యుడ నైతినే "

   దరిజేరితే నేను ధన్యుడనైతిని నిరతము నను గావుమీ.                                "
    ంఅదికి నూర్ధ్వంబైన మంథెన్న నిలయా మీ మహిమ లేమన నందునే.   "
              
          ఈఇ గేయం కరీమ్నగర్ జిల్లాలోని  తాళ పత్రాలలో లభ్య మైనట్లుగా శ్రీ బిరుదురాజు రామరాజు గారు తెలిపారు.
     


     
      
      

No comments:

Post a Comment