Saturday, July 4, 2015

సహకారం


            రామయ్య అనే రైతు మొక్కజొన్న పంట పండించే వాడు.ప్రతి సంవత్సరం వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొంటూ ప్రశంసలను, అనేక బహుమతులు పొందేవాడు.అతనితో పాటు చుట్టు పక్కల రైతులు కూడా అలాంటి  మొక్కజొన్ననే ప్రదర్శనకు తీసుకు రావడం గమనించిన ఒక విలేఖరి రామయ్యను "మీ పొరుగులతో రైతులతో ఈ విత్తనాన్ని ఎల పంచుకో గలిగారు"అని అడిగాడు.
       "గాలి పుప్పొడిని  పక్వమౌతున్న మొక్కజొన్న నుండి గ్రహించి అన్ని పొలాల మీదా జల్లుతుంది.చుట్టు పక్కల నాసిరకం  మొక్కజొన్న నాటితే నా పంట కూడా నాసిరకంగా తయారు అవుతుంది.నా పంట నాణ్యతగా ఉండాలంటే పక్క వారి పంట కూడా మంచి గా ఉండాలి.అందుకే సహాయం చేస్తున్నా."అని చెప్పాడు.
        రామయ్య పంట ద్వారా అద్భుతమైన  మానవ సంబంధాలను ఆవిష్కరించాడు.ఇరుగుపొరుగు సహకారం గా ప్రశాంతం గా ఉంటేనే మనము ప్రశాంతం గా ఉండగలం.విజయం సాధించ డానికి పట్టుదల,కృషి వ్యక్తిగతమైనప్పటికి  ఇతరుల సహకారం లేనిదే పొందలేము.
        సేంద్రీయ ఆహార పదార్ధాలకు నేడు ఆదరణ పెరుగుతోంది.రసాయన ఎరువులు వాడిన భూములు సాధారణ స్థితికి రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది.మనము ఒక్కరమే వేస్తే ఫలితముండదు.చుట్టూ రసాయన ఎరువుల పంటలు ఉండటం వలన గాలి కి  ఆ రసాయనాలు మన పంటకూ అంటు కుంటాయి.పక్క పొలం నుంచి వచ్చే నీరు కూడా పంటను కలుషితం చేస్తుంది.కాబట్టి  అందరి సహకారం తోనే సేంద్రీయ పంటలు పండించడం సాధ్యమౌతుంది.పైన రామయ్య కధలో చెప్పింది కూడా అదే."కలసి ఉంటే కలదు సుఖం,""సర్వే జన సుఖినో భవంతు" అనే భావనలు మన నరనరాల్లో జీర్ణించుకు పోయాయి.

No comments:

Post a Comment