Monday, October 5, 2015

ఆభిఙ్ఞాన శాకుంతలం


  
       "కావ్యేషు నాటకం రమ్యం "అని అలంకారికుల నిర్వచనం.ఆ నాటకాలలో  కాళిదాసు విరచితమైన  ఉత్తమమైనదని అందులో చతుర్ధాంకము ఆ అంకములోని నాలుగు శ్లోకములు కావ్య జగత్తులో ప్రసిధ్ధమైనవి.కాళిదాసు నాటకాన్ని 'కందుకూరి వీరేశలింగం తెలుగు లోకి అనువదించారు.ఆ ప్రసిధ్ధ శ్లోకాలను తెలుగు లోకి ఎలా అనువాదము చేసారో చూధ్ధాము.
     సందర్భము శకుంతలను కణ్వుడు అత్త వారింటికి పంపే టప్పుడు తండ్రిగా ఆయన పొందే వేదన బిడ్డకు ఆయన చెప్పే సుధ్ధులు ఆ తరానికే కాదు ఏ తరానికీ ఆచరణ యోగ్యమే!

 1.కొందలమందె డెందము శకుంతల తానిపుడెగునం చయో!
    క్రందుగ బాష్ప రోధమున గంఠమునుం జెడె;దృష్టి మాంద్యముం 
    బొందె;నొకింతపెంచిన తపోధనులే యిటుకుంద,నెంతగా 
    గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!

2. ఎవతె జలంబు మీకిడక యెన్నడు ద్రాగదు తాను ముందుగా 
    నెవరితె ప్రేమచే జదుమ దీప్సిత భూషణమయ్యు మీ చిగు 
    ళ్ళెవతెకు మీరు తొల్త ననలెత్తుట పండువుగాగనుండు నా 
    ప్రవిమల గాత్రి యేగు బతి పజ్జకు నందఱ్నుజ్ఞ యీయరే.

3.మమ్ములనత్తపోధనుల,మాన్య భవత్కులమున్,స్వబంధులన్ 
   సమ్మతి వేడ కీమె యెటొ సల్పిన నీపై కూర్మి,నెంచి మా 
   కొమ్మను నేలుకొమ్మ సరి కొమ్మలతో సమ గౌరవంబునన్;
   బిమ్మటిదెల్లభాగ్యమగు;పేర్కొనరాదది యింతి బంధువుల్.

4.గురులకు సేవజేయు మనుగుంగతి జూడుము నీసపత్నులన్ 
   వరుడలుక వహించినను భర్తృవిరుధ్ధవుగాకు మీసునన్;
   పరిజనులందు జూపుము కృపం గడు;బొందకు భాగ్య గర్వమున్;
   తిరిగిన నిట్లు,కాంతురు సతీత్వము కాంతలు;నింద్య లొండుచోన్.

             మొదటి పద్యము కూతురుని అత్తవారింటికి పంపే సాధారణ తండ్రి వేదన,రెండవపద్యము అప్పటి వరకు ఆమె సన్నిహితముగా మెలిగిన అందరి వధ్ధ నుండి అనుమతి తీసుకోవడం వర్ణించారు.
            ఇక మూడవ ,నాలుగవ పద్యాలలో కొత్తగా అత్తవారింటికి వెళ్ళిన ఆడపీల్ల ఎలా మెలగాలో వివరంగా వర్ణించారు.
    

No comments:

Post a Comment