Kస్మృత్యంజలి
కొంటె బొమ్మల బాపు
తెలుగు వారి మదిని తెలుపు
అందాల రాముడిగా
అలరించి,
ముంగిట ముత్యాల ముగ్గుగా
మురిపించి,
ప్రతి ఇంటి బుడుగుగా
బులిపించి,
నవరసా లొలికించు నాయికలతో,
ఎద సందడి చేసి,
బాపూ బొమ్మలే తెలిగింటి ఆడపడుచులు గా
ఎద తంత్రులు మీటి,
పురాణ పురుషులు ఎవరినైనా గీతలో
ఒదిగించి,
గీతా, రాతా నాదేనంటూ
దశ దిశలా చాటి,
కృష్ణ లీలా విలాస భాగవతాన్ని
తెరకెక్కించి,
కూసింత కలాపోసన చెయ్యాలన్న సత్యాన్ని
లోకానికి చాటి,
గోరంత దీపంతో కొండంత వెలుగుని పంచి
చీకటిని మిగిల్చి,
రమణ లేని సగం ప్రాణాన్ని
నిలపలేనంటూ,
బుధ్ధి మంతునిలా భగవంతుని పిలుపుకి
అలో అలో అంతూ
తరలి వెళ్ళి,
తెలుగు వారి ప్రతి హృదయం
కన్నీటి కడలి చేసిన
బాపూ.....
భగవంతుని సాక్షిగా
మరో జన్మంటూ ఉంటే
"బాపూ" గానే రమాంటూ
ఆర్తిగా వేడుకుంటాము.
***<>
No comments:
Post a Comment