Wednesday, July 15, 2015

ఘొరం


        వేదం లా ఘోషించే గోదావరి
        నేడు రోదనల హాహాకారాల రాదారి
        పుణ్యాన్ని గుత్తగా పొందాలని
        కొండంత ఆశతో, ఆనందోత్సాహాలతో
        అరుదెంచి
        అడుగులు తడబడి తొక్కిటబడి
        వేయి కాళ్ళు ఒక్కటై వేసిన
        అడుగులు మిగిల్చింది
        అవ్వను పోగిట్టుకున్న మనవడిని
        సతులను కోల్పోయిన పతులను
        రుణాను బంధాలు తెగి
        నిశ్చేష్టులై నిలచిన అభాగ్యులను
        పుణ్యలోకాలకు తరలిపోయారు వారు
        పుష్కర స్నానం పుణ్యమా?పాపమా?
        పోయినోళ్ళందరూ పుణ్యాత్ములే
        వాళ్ళను కోల్పోయిన అభాగ్యులు వీళ్ళు
        మాధ్యమాల నిండా ఇవే దృశ్యాలు
        హృదయాలను కలచివేసేటట్లు
        కొన్ని వేదంతో,కొన్ని సానుభూతితో
        దూఃఖంతో కొన్ని,రాజకీయంతో మరికొన్ని
        సమస్యను పరిష్కరించేవి ఎన్ని?
        ఎవరిదీ పాపం?
        తిలా పాపం తలా పిడికిడన్నట్లు
       ముందు చూపు లేని ప్రభుత్వానిదా?
       సమన్వయం లేని అధికారులదా?
       అవగాహన లేని ప్రజలదా?
       పాపం ఎవరిదైనా!
       ఆత్మీయులను గోదారికి అర్పించి
       హృదయం
       తూట్లు తూట్లుగా తునిగి పోతుంటే
       మరలిపోయేవారు తమ వేదనల చిచ్చు
       మరచిపోగలరా జీవనపర్యంతం
       పుణ్యానికి పోతే పాపమెదురైనట్లు
       ఎంత ఘోరం!
       అకాల మృత్యుబారిన పడిన వారి ఆత్మకు
      శాంతి కలగాలని ప్రార్ధించడం తప్ప
      మనమేమి చేయగలం?

No comments:

Post a Comment