Monday, August 10, 2015

తప్పులు


       అన్నిటి కంటె తేలికైన విషయం ఏమిటంటే ఎదుటి వారిలో తప్పులెంచడం.మనం చేసిన తప్పులు ఒప్పులుగా ను అదే ఎదుటి వారు చేస్తే తప్పులు గాను కనిపిస్తాయి.
   "తప్పులెన్ను వారు తండోప తండంబు
    లుర్వి జనులకెల్ల నుండు తప్పు
    తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు"---అని వేమన ఏనాడో చేప్పాడు.
        కొంతమంది తాము తప్పు చేసినా ఎదుటి వారి మీద నెట్టివేస్తారు.తప్పు చేయడం మానవాళికి సహజం .తమ తప్పు తాము తెలుసుకొని దిద్దు కొనేవాడే విజ్ఞుడు.
     కాసుల పురుషోత్తమ కవి వ్రాసిన "నరసిమ్హ శతకము"లోని ఈ పద్యము ఎ తప్పులకు ఎవరు బాధ్యులో చక్కగా చెప్పాడు.

         పసరంబు పంజైనబసుల కాపరి తప్పు
                  ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు
        భార్య గయ్యాలైన బ్రాణ నాధుని తప్పు
                  తనయుడు దుడుకైన దండ్రి తప్పు
        సైన్యంబు చెదిరిన సైన్య నాధుని తప్పు
                  కూతురు చెడుగైన మాత తప్పు
        అశ్వంబు దురుసైన నారోహకుని తప్పు
                 దంతి మదించ మావంతు తప్పు
        ఇట్టి తప్పులెఱుంగక యిచ్చ వచ్చు
       నటుల మెలగుదు రిప్పుడీ యనుని జనులు
       భూషణ వికాస!శ్రీ ధర్మ పురి నివాస!
       దుష్ట సమ్హార!నరసిమ్హ!దురితదూర! 
               శతక పద్యాలు ఆ నటికి,ఈ నాటికి,ఏ నాటికీ అనుసరణీయమే!

No comments:

Post a Comment