Wednesday, August 26, 2015

ఉండవల్లిగుహలు


   
           రాజుల కాలం లో గుహలలో చిత్రాలు వేయడం, శిల్పాలు చెక్కటం ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటివే విజయవాడకు 6కి.మి లలో ఉన్న ఉండవల్లి గుహలు.4,5 శతాబ్దుల కాలం లో విష్ణు కుండినిలకు చెందినవని చరిత్రకారుల అభిప్రాయం.బౌధ్ధ శిల్పకళా రీతులు కంపించడాన్ని బట్టి ,బౌధ్ధులకు విశ్రాంత మందిరాలుగా ఉండెవేమోనని ఒక అభిప్రాయం.
      ఒకే పర్వతం లో 4అంతస్తులుగా నిర్మించ బడినవి.ఇవి ఇసుక రాయితో కూడినది.వివిధ దేవతా ప్రతిమలు,త్రి మూర్తుల శిల్పాలు ఏక శిలా నిర్మితాలు.రెండవ అంతస్తులో గ్రానైట్ ఏకశిలలో 20అడుగుల విష్ణువు యొక్క శయన భంగిమ  ఉన్నది .ఈయనని అనంత పద్మనాభ స్వామి అంటారు.బయటి వైపున సప్తఋషుల విగ్రహాలు కలవు.పై నుంచి చూస్తే పచ్చటి వరి పైరులు కనువిందు చేస్తాయి.ఇది ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పరిధి లోకి వస్తోంది.అన్ని రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్న  వీటిని తప్పనిసరిగా చూడదగిన ప్రదేశము.





No comments:

Post a Comment