Wednesday, September 2, 2015

చక్కెరపొంగలి


     బియ్యం--------------1/2కెజి
     పెసరపప్పు-------1/4కెజి
     బెల్లం---------------600గ్రాములు
     పంచదార------150గ్రాములు
     జీడిపప్పు----------250గ్రాములు
    కిస్మిస్---------------200గ్రాములు
    ఎండు కొబ్బరి------200గ్రాములు
    ఏలకులు-------------5గ్రాములు
    నెయ్యి--------------400గ్రాములు
          ముందు పెసరపప్పు కమ్మటి వాసన వచ్చేలా వేయించుకోవాలి.తరువాత బియ్యము,పెసరపప్పు కలిపి అన్నము వండాలి. అది ఉడికేలోపు జీడిపప్పు,కిస్మిస్,ఎండుకొబ్బరి సన్నగా తరిగి ఆ ముక్కలు నేతిలో మంచి రంగు వచ్చేటట్లు వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి.ఏలకులు పొడిలా చేసుకోవాలి.ఉడికిన అన్నము ఒక మందపాటి గిన్నెలో వేసుకొని తరిగిన బెల్లము, పంచదార వేసి స్టౌ మీద పెట్టి కొంచెం కొంచెం నెయ్యి  వేస్తూ అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి.చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు చివర్లో వేయించి పెట్టుకున్న దినుసులు ,ఏలుకులపొడి వేసి దించేయాలి.చిటికెడు పచ్చ కర్పూరం కూడా వేస్తే మంచి వాసన వస్తుంది.మంచి పాకం వస్తుంది కాబట్టి రెండు మూడు రోజులు నిలవ కూడా ఉంటుంది.బియ్యము,పెసరపప్పు కలిపి ఎంత కొలతో అంత జీడిపప్పు,కిస్మిస్,కొబ్బరి ముక్కలు కలిపి అంత. నెయ్యి కూడా ఇంచుమించు సమానం గా పడుతుంది.ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి రాజీ పడకుండా చేసుకుంటే అమృత తుల్యమే.
         దీన్ని కొంతమంది పాలు పోసి,మరికొంతమంది విడిగా పాకం పట్టి పోసి  ఇంకా  చాలా రకాలుగా చేస్తారు కానీ దీనంత రుచి రాదు.ఒక్కసారి ప్రయత్నించి చూడంది.తేడా మీకే తెలుస్తుంది.

No comments:

Post a Comment