Friday, January 16, 2015

చాటువు:--


        పూర్వం కవులు రాజులను పొగడ్తలతో ,అతిశయోక్తులతో  కవి త్వం చెప్పేవారు.తిరుమల రాయలు  రామలింగని స్వభావోక్తి లో ఒక పద్యం చెప్పమని కోరాడట. ఆయనకు ఒక కన్ను లేదు.ఆ విషయాన్ని ఈ పద్యం లో ఎంత గొప్పగా చెప్పడో చూడండి.
        "అన్నాతి కూడ హరుడవు
         అన్నాతిని కూడకున్న అసుర గురుడ వీ
         వన్నా తిరుమలరాయా!
         కన్నొక్కటి లేదు కాని కంతుడు వయ్యా!
          ఆ+నాతి  అంటే భార్య తో కూడి ఉంటే మూడు కన్నులు అవుతాయి కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుడువే! లేకుంటే ఒక కన్ను తో అసుర గురుడు శుక్రాచార్యుడివి.ఆ కన్నొక్కటి ఉన్నచో మన్మధుడువే! --అని చమత్కారం గా నొప్పించ కుండా చెప్పాడు.ఇలాంటి  చక్కటి పద్యాలు మన సాహిత్యానికి లో కోకొల్లలు గా  ఉన్నాయి.చదివి ఆస్వాదించే ఓపికా,తీరికా మనకుండాలి.

No comments:

Post a Comment