Wednesday, January 28, 2015

చాటువు:--


       "ఆంధ్ర రత్న"దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రాజకీయాలలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు.బారిష్ఠరుగా తన వాక్చమత్కృతితో,ఆకట్టుకునే కంఠ మాధుర్యంతో గాంధీజీ దృష్టిని ఆకర్షించినాడు.రామదండు ఉద్యమం,చీర అలా పేరాల ఉద్యమాలతో ప్రపంచాన్నీ ఆకర్షించాడు.చాటు కవిగా కూడా ప్రసిధ్ధుడు.తన ప్రసంగాలలో ఆశువుగా  అనేక చాటువులు దొర్లేవి. ఇతరులపై వ్యగ్యాస్త్రాలు సంధించడమే కాక తన పై తాను చెప్పుకొగల సాహసి.మచ్చుకి ఈ చాటువు ----
          "వేదాంతముల తోడ వెక్కిరింతల తొడ
                    లెక్చర్ల సాగించు లీల నెవడు
          లక్ష్య మొక్కటి లేక యక్ష గానములతో
                    కాలంబు వృధ పుచ్చు ఘను డెవ్వండు
          చీరాల పేరాల చిన్ని గ్రామంబుల
                    దొసమెన్నక కొంప తీసె నెవడు
          ఆంధ్ర రత్నం బంచు అహమికతో పెద్ద 
                   పిన్న లంచును మది నెన్న డెవడు
          అట్టి గోపాల కృష్ణుని హాస్య సరళి
          గోల కృష్ణునిగా చేసి కొరత దీర్చె
          కాక పగములుండునే 'గాడూ కైన
          రామ నగరీ నరేంద్ర! శ్రీ రామచంద్ర!"

               ఇలాంటి దుగ్గిరాల పై అబ్బూరి వారు చెప్పిన చాటువు--
   "ఉపమా పై ,పెసరట్టు పై,ఇడిలి పై హుమ్మంచు చూపించు నీ
    జప సంబద్ద పరాక్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు
    భ్రపు జిల్లేబి పకోడి లడ్వగయిరా పై కొంతమంది రానిమ్ము శ్రీ
   చపలాపాంగ సితాంగనా హృదయ పా శా!పూజ్య వస్తు ప్రియా!"

              పండితులు పాడిత్యం లోనే కాక రసాస్వాదనలో స్వ పర భేదం పాటించరు.మనం కూడా ఆస్వాదిద్దాము.

    
             

No comments:

Post a Comment