Saturday, January 17, 2015

కాశీఖండము:--


      శ్రీ నాధుడు రచించిన కాశీ ఖండము లోని ఈ రెండు పద్యముల లో అధికార,ఐశ్వర్య మదాంధులైన ఆ నాటి  రాజుల దిష్టత్వాన్ని నిర్మొహమాటం గా ఎలా చెప్పాడో గమనించండి.ఈ నాటి పాల కులకు కూడా చెంప పెట్టు అనటం లో సందేహం లేదు.
      "ఘ్నతరాహంకార కాలకూట విషాన
                 లాభీలములు కట్క్షాంచలములు
       దుర్వారతర తీవ్ర గర్వ గళగ్రాహ
                కవిత గాద్గద్య ఘర్ఘరము మాట
      యస్మితా సంప్రభూత స్మయాపస్మార
               విస్తృత ధైర్యంబు వినయ గరిమ
      యుధ్ధామ దర్ప భారోష్ణ దాహ జ్వరా
               రంభ సంభృత వికారంబు మనసు
      చరణ చంక్రమ మభిమాన సన్నిపాత
      జాత సర్వాంగ భంగంబు జనపతులకు
      భూ భుజుల తప్పె యది వారి బొందియున్న 
      ధరణి సామ్రాజ్య భారంబు తప్పు గాక?

2.   భువనైక ధన్విచే బుష్పాయుధుని చేత
                  బ్రసవాస్త్రమున నేటు పడనివాడు
      అతి గాఢమైన క్రోధాంధకారమ్మున
                  కన్నుల అంధుండు గానివాడు
      నిర్ణిబంధన లోభ నిద్రాభరంబున
                 పారవశ్యంబుచే బడనివాడు
     లక్ష్మీ కటాక్ష లీలా సీధు మదమున
                 మనము లోపల నున్నుకొనని వాడు
     లేడు!భూపతి!!కలిగెనా వాడు నృపుడె
    విశ్వ ధాత్రీ జనుల పాలి వేల్పు గాక!
    బాహ్య శత్రుల బరిహరింపంగ వచ్చు
    అంతరారుల నిర్జింప నలవి కాదు"

                  కామ,క్రోధ,లోభ మోహముల చిక్కిన జనుల నేగతి పాలింప నెంచును.బాహ్య శత్రువులు కనిపిస్తారు పోరాడవచ్చు.కాని అంతః శత్రువులతో  పోరాడాలంటే ఆత్మస్థైర్యం కావాలి. ఈ నలుగురు శత్రువులు లేని నాయకులు ఇప్పుడు ఎవరున్నారు?

No comments:

Post a Comment