Tuesday, January 20, 2015

ధర్మము:-


       ఏది ధర్మము?వేదములు,ఉపనిషత్తులు అనేక ధర్మాలను ప్రభోహించాయి.ఒక ధర్మాన్ని పాటించాలనుకున్నప్పుడు మరొక దానికి భాగం వాటిల్లవచ్చు.
                ఒక అరణ్యం గుండా గౄహస్థు వెళుతున్నడు.అతనిని చంపి అతని దగ్గరున్న ధనాన్ని అపహరించాలని దొంగలు వెంటబడతారు.ఆ గౄహస్థు
దగ్గర లో నున్న ఋషి ఆశ్రమం లో దాక్కుంటాడు.వెంబడించిన దొంగలు ఋషిని గృహస్థు ఉనికిని అడుగుతారు.అతని ఉనికి చెప్పక పోతే "సత్యం వద" జరుగుతుంది.చెబితే "అహింసా పరమో ధర్మః"అనే ధర్మానికి విఘాతం కలుగుతుంది.
         రెండు ధర్మాలకు విప్రతిపన్నములై నప్పుడు ఏది పరమ ధర్మమో దానిని అనుసరించాలి.స్వార్ధాన్ని కుటుంబం కొరకు,కుటుంబమును సంఘం కొరకు,సంఘమును దేశము కొరకు,దేశమును విశ్వము కొరకు,విశ్వాన్ని సత్యం కొరకై త్యజించాలి.ఏ త్యాగమే పరమధర్మము.చిన్న ధర్మాన్ని పెధ్ధ ధర్మము కొరకై విడిచిపెట్టాలి.ఏదియో ఒక ధర్మం చేయుటగాని ,ఏ ధర్మాన్ని స్వీకరింప కుండా ఉండటం కూడా కర్తవ్యం కాదు.

No comments:

Post a Comment